
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) సందడి మళ్లీ మొదలైంది. గోవాలోని తిలక్ మైదానం వేదికగా ఎస్సీఈస్ట్ బెంగాల్, జంషెడ్ పూర్ మధ్య ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎస్సీ ఈస్ట్ బెంగాల్ తరఫున క్రోషియన్ డిఫెండర్ ఫ్రాంజో 17వ నిమిషంలో గోల్ చేశాడు. దాంతో ఈస్ట్ బెంగాల్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇక ఫస్టాఫ్ టైమ్ ముగుస్తుందనగా జంషెడ్పూర్ కెప్టెన్ పీటర్ హార్ట్లీ 45వ నిమిషంలో గోల్ చేయడంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. సెకండాఫ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి దూసుకెళ్లినా.. జంషెడ్పూర్ డిఫెండర్స్ తిప్పికొట్టారు. దాంతో ఇరు జట్లు గోల్ లేకుండానే ఆటను ముగించడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు.