న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PinkBall Test: ఇషాంత్‌ శర్మ సెంచరీ.. క‌పిల్‌దేవ్ త‌ర్వాత తొలి పేస‌ర్‌గా అరుదైన ఘనత!!

Ishant Sharma will become the second Indian pacer after Kapil Dev to complete 100 Tests
Ind vs Eng,3rd Test : Ishant Sharma All Set To Play His 100th Test At Motera Stadium || Oneindia

హైదరాబాద్: ఓ పేసర్‌ గాయాలను అధిగమించి వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మంది మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. టీమిండియా తరఫున మాజీ పేసర్ కపిల్‌దేవ్‌ (131) వంద టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ఎందరో పేసర్లు భారత జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు.

సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడిన జహీర్‌ ఖాన్‌ (92) కూడా సెంచరీ కొట్టలేకపోయాడు. అయితే ఆ ఘనత ఇప్పుడు సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మను వరించనుంది. బుధవారం నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టు ఇషాంత్‌కు వందో టెస్ట్ మ్యాచ్. సెంచరీ మ్యాచ్‌కు ముందు ఇషాంత్ పలు విశేషాలు పంచుకున్నాడు.

నా సారథులు అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారు

నా సారథులు అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషాంత్‌ శర్మ మాట్లాడుతూ... 'రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో నా కెరీర్‌ ఆరంభించా. ఆ తర్వాత అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే కెప్టెన్సీలో ఆడా. అందరూ ఎంతో మద్దతు ఇచ్చారు. కెప్టెన్సీలో ఎవరి ప్రత్యేకత వారిదే. అయితే నాయకుడు పేసర్లను ఎలా వాడుకుంటాడనేది ముఖ్యం. ఈ విషయంలో నా సారథులు నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారు. కెప్టెన్‌ ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవడం ముఖ్యం. అది అర్థమైతే విజయవంతంగా ముందుకు సాగవచ్చు' అని అన్నాడు.

టీ20, వన్డేలు ఆడనందుకు బాధ లేదు

టీ20, వన్డేలు ఆడనందుకు బాధ లేదు

'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నన్ను ఎంపిక చేయకపోవడంపై ఎలాంటి బాధ లేదు. టెస్ట్ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషిస్తున్నా. టీ20, వన్డేలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే.. టెస్టుల ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే దాన్ని పక్కన పెట్టి టెస్ట్ ఫార్మాట్‌ కోసం నన్ను నేను కొత్తగా మలుచుకున్నా. భారత పేస్‌ దళానికి ఎక్కువ కాలం సేవలందించగలిగే సత్తా జస్ప్రీత్‌ బుమ్రాలో ఉంది. మహమ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీలో మంచి వేగం ఉంది. వాళ్లు ఇదే నిలకడ కొనసాగించడం ముఖ్యం' అని లంబూ పేర్కొన్నాడు.

వందో టెస్టు ప్రత్యేకమైనదేమీ కాదు

వందో టెస్టు ప్రత్యేకమైనదేమీ కాదు

'వందో టెస్టు ప్రత్యేకమైనదేమీ కాదని నా ఉద్దేశం. గత మ్యాచ్‌లో ఎలాంటి తీవ్రతతో ఆడానో మొతెరాలోనూ అలానే బరిలోకి దిగుతా. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు విజయాలు సాధిస్తేనే ఎక్కువ ఆనందిస్తా. విజయాల్లో కీలక పాత్ర పోషించే సత్తా ఉన్నంత కాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. కపిల్‌దేవ్‌ 131 టెస్టుల ఘనతను అధిగమించాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి నా దృష్టంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మీదే. నా దృష్టిలో ఇది ప్రపంచకప్‌ గెలవడం లాంటిదే' ఇషాంత్ చెప్పాడు.

మొతెరా అద్భుతంగా ఉంది

మొతెరా అద్భుతంగా ఉంది

'ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి స్వింగ్‌ అవడం సహజం. అయితే మంచు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకం. సెషన్ల వారిగా పిచ్‌లో మార్పులు ఉంటాయనుకుంటున్నా. గులాబీ బంతి స్వింగ్‌ అవడం మానేస్తే.. సులువుగా బ్యాట్‌ మీదకు వస్తుంది. అలాంటి సమయంలో స్పిన్నర్లు ప్రధానమవుతారు. అందుకే జట్టు కూర్పు, ఎవరు కీలకం అనేది ఇప్పుడే చెప్పలేం. మొతెరా స్టేడియం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మ్యాచ్‌ ఆడేందుకు అందరం ఆతృతగా ఎదురుచూస్తున్నాం' అని లంబూ చెప్పుకోచ్చాడు.

గొప్ప గణాంకాలు మాత్రం కావు

గొప్ప గణాంకాలు మాత్రం కావు

99 టెస్టులు.. 302 వికెట్లు.. 32.22 సగటు ఇదీ ఇషాంత్‌ శర్మ ప్రదర్శన. ఇవి గొప్ప గణాంకాలు మాత్రం కావు. వంద టెస్టులాడిన బౌలర్లు పడగొట్టిన వికెట్ల జాబితా తీస్తే.. ఇషాంత్‌ స్థానం చివరలో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లలో లంబూ ప్రదర్శన ఎంతో మారింది. ఇషాంత్‌ టెస్టు కెరీర్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు. తొలి 33 టెస్టుల్లో సగటు 32.6. కెరీర్‌ మధ్య దశలో 33 టెస్టుల్లో 41.34 సగటు నమోదు చేశాడు. చివరి 33 టెస్టుల్లో ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ సగటు 23.42 కావడం విశేషం.

IPL 2021 Auction: మాక్స్‌వెల్‌కు అంత ధర చెల్లించడం ఆశ్చర్యంగా ఉంది: వార్నర్‌

Story first published: Tuesday, February 23, 2021, 12:28 [IST]
Other articles published on Feb 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X