
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పంట పండింది. రూ. 15.25 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడటంతో ఈ జార్ఖండ్ వికెట్ కీపర్కు జాక్ పాట్ ధర లభించింది. 2018 మెగా వేలంలో రూ.6 కోట్లకు తీసుకున్న ముంబై ఇండియన్స్.. మళ్లీ భారీ ధరకే సొంతం చేసుకుంది.
తనను మళ్లీ ముంబై ఇండియన్స్ తీసుకోవడంపై ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఇషాన్ కిషన్ భారీ ధర పలకడంపై అతని గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చాలా గర్వంగా ఉందని కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి.

ఇక అదితి హుండియాతో గత కొన్నాళ్లుగా ఇషాన్ కిషన్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ రూమర్లపై ఈ ఇద్దరూ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ఒకరి పోస్ట్లకు మరొకరు స్పందించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి మ్యాచ్లకు హాజరు కావడం.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ను బాహటంగానే కొనియాడటంతో వీరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు అర్థమైంది.
ఇక ముంబై ఇండియన్స్ ఇంత ధర చెల్లించి ఓ ప్లేయర్ను వేలంలో తీసుకోవడం ఇదే తొలిసారి. గత 14 సీజన్లలో ఏనాడు కూడా ముంబై వేలంలో రూ.10 కోట్లు పైగా ఎవరికి ఖర్చు చేయలేదు. అయితే ఇషాన్ కిషన్కు అంత ధర చెల్లించడంపై ఆ జట్టు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.