
ముందే చెప్పి.. తొలి బంతికే సిక్స్
అయితే తొలి వన్డేలో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొడతానని భారత డ్రెస్సింగ్ రూమ్లోని ప్రతి ఒక్కరికీ ఇషాన్ కిషన్ చెప్పాడట. బంతి ఎక్కడ పడినా.. తొలి బంతికే సిక్సర్ కొడతానని చెప్పిమరీ మైదానంలోకి దిగాడట. చేపినట్టే తాను ఎదుర్కొన్న తొలి బంతిని మైదానం బయటకు ఇషాన్ పంపాడు. ధనంజయ్ డిసిల్వా వేసిన 6వ ఓవర్ మూడో బంతికి పృథ్వీ షా ఔట్ కాగా.. ఆ తర్వాతి బంతినే ఇషాన్ సిక్స్ బాదాడు. శతకొట్టేలా కనిపించిన ఇషాన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సందకన్ బౌలింగ్లో భానుకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అరుదైన ఘనత
వన్డే కెరీర్ను సిక్స్, బౌండరీతో ప్రారంభించిన జార్ఖండ్ కుర్రాడు ఇషాన్ కిషన్ .. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం వన్డేలో అతి తక్కువ బంతుల్లో(33) ఫిఫ్టి సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో కృనాల్ పాండ్యా తన అరంగేట్రం మ్యాచ్లో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రోలాండ్ బుట్చేర్, జాన్ మోరిస్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Tokyo Olympics 2021: కొత్తగా నాలుగు ఆటలు.. బేస్బాల్, సాఫ్ట్బాల్ క్రీడలు పునరాగమనం!!

క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లీ
ఇక కొలంబోలోని ప్రేమదాస మైదానంలో ఇషాన్ కిషన్ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కిషన్ను సడెన్గా చూస్తే.. విరాట్ కోహ్లీ ఏంటి ఇక్కడ ఉన్నాడు అనిపించక మానదు. కొందరైతే ఇతడు క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలను వైరల్ చేశారు. 23 ఏళ్ల ఇషాన్ అచ్చం కోహ్లీని తలపిస్తున్నాడంటూ ట్విటర్లో కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే హెల్మెట్ పెట్టుకుంటే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్లా కనిపిస్తున్నాడని పోస్టులు చేశారు. ఆదివారం అతని బర్త్డే కూడా. హాఫ్ సెంచరీ చేసి ఆ రోజును మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు.

14 మ్యాచ్ల్లో 516 పరుగులు
ఇషాన్ కిషన్ 2020 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున 14 మ్యాచ్ల్లో 516 పరుగులు సాధించాడు. ఆపై విజయ్ హజారే ట్రోపీలో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన ఇషాన్.. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. మొదటి టీ20లో విఫలమైన శిఖర్ ధావన్ స్థానంలో రెండో టీ20లో ఇషాన్ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే 56 పరుగులు చేశాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్.. తన ఆరంభ మ్యాచ్లోనే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం విశేషం. అనంతరం ఐపీఎల్ 2021లో చెలరేగడంతో.. శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు.


Click it and Unblock the Notifications












