అసలేం జరిగిందంటే...
కరోనాతో గతేడాది వాయిదా పడిన దిగ్గజ క్రికెటర్ల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఇటీవల రాయ్పూర్ వేదికగా పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్.. టోర్నీ సందర్భంగా సతీమణి సఫా బైగ్, కొడుకుతో కలిసి ఫొటో దిగాడు. అయితే ఈ ఫొటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. ఈ ఫొటోలో ఇర్ఫాన్ కొడుకును ఎత్తుకొని ఉండగా.. పక్కన భార్య సఫా బేగ్ నిలబడి ఉన్నది. ఆమె ముఖం మాత్రం బ్లర్ చేసి ఉండటంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.

ప్రతీ ఫొటోలోనూ..
ఈ ఫొటోనే కాకుండా పఠాన్ సతీమణికి సంబంధించిన ప్రతీ ఫొటోలో సఫా బేగ్ తన ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. ఒక్కోసారి చేతులతో మొఖాన్ని కవర్ చేసుకుంటుంది. ఇర్ఫాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భార్యతో దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి. కానీ దేంట్లోనూ ఆమె ముఖం స్పష్టంగా మాత్రం కనిపించదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇర్ఫాన్పఠాన్పై ట్రోలింగ్కు దిగారు.

గట్టిగా బదులిచ్చిన పఠాన్..
తనను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్న నెటిజన్లకు పఠాన్ గట్టిగా కౌంటరిచ్చాడు. తన భార్యకు తాను భర్తను మాత్రమేనని.. మాస్టర్ను కాదని బదులిచ్చాడు. 'ఈ ఫొటోను నా కొడుకు అకౌంట్ ద్వారా నా సతీమణి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్కు చాలా వ్యతిరేకత వస్తోంది. ఆమె ఉద్దేశపూర్వకంగానే తన ముఖాన్ని బ్లర్ చేసుకుంది. నేను తన భర్తను, మాస్టర్ను కాదు" అంటూ బదులిచ్చాడు. ఆమె ఫొటో కనిపించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ సఫా బేగ్ ఇష్టం లేదనే విషయాన్ని పఠాన్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
