
మూడు రెట్లు పెరిగే చాన్స్..
2017లో జరిగిన వేలంలో స్టార్ ఇండియా అప్పటికి రికార్డు స్థాయిలో 16,347.50 కోట్లకు ఐదేళ్ల రైట్స్ (2018-22) కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్లో టీమ్స్, మ్యాచ్ల సంఖ్య పెరగడం, ఆటపై ఆసక్తి రెట్టింపు అవడంతో పాటు స్పోర్ట్స్ బిజినెస్పై ప్రపంచంలోనే పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపెట్టడంతో ఐపీఎల్ మీడియా రైట్స్ ధర క్రితం సారితో పోలిస్తే రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీడియా రైట్స్ కోసం తొలిసారి ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలయ్యే వేలంలో పోటీదారులు ఆన్లైన్ పోర్టల్లో బిడ్స్ వేస్తారు. చివరికి అత్యధిక బిడ్ వేసిన వారికి హక్కులు దక్కుతాయి. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తవకపోతే సోమవారం కూడా కొనసాగుతుంది.

అమెజాన్, గూగుల్, జీ ఔట్..
మీడియా రైట్స్ రేసు నుంచి అమెజాన్, గూగుల్ తప్పుకోగా, తాజాగా జీ ఎంటర్టైనమెంట్ కూడా వాటి సరసన చేరినట్లు తెలుస్తోంది. సాధారణ టెక్నికల్ బిడ్ దాఖలు చేసిన జీ.. ప్యాకేజ్-ఎ కోసం ఎలాంటి బిడ్ వేయలేదని సమాచారం. దీంతో రిలయన్స్ వయకామ్-18, సోనీ, డిస్నీ స్టార్ పోటీలో ముందున్నాయి. ప్రస్తుతానికి పది కంపెనీలు రేస్లో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈ మూడింటి మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇంటర్నేట్ (డిజిటల్), రిలయన్స్ జియో (డిజిటల్), సూపర్ స్పోర్ట్ (ఇంటర్నేషనల్ రైట్స్) కూడా బరిలో నిలిచాయి.

రిలయన్స్కే చాన్స్..
'నాలుగు సంస్థలు బిడ్డింగ్ తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆఖరి బిడ్లు దాఖలు చేశాక విజేత ఎవరో తెలుస్తుంది. తుది జాబితాలో నిలిచిన ఆ నాలుగు సంస్థలు.. వయాకామ్18, డిస్నీ స్టార్, సోనీ, జీ'అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ రేసు నుంచి ఇప్పటికే అమెజాన్, గూగుల్ తప్పుకుంది.
ఈ నేపథ్యంలో పోటీ ప్రధానంగా డిస్నీ స్టార్, వయాకామ్18 మధ్య ఉండే ఆస్కారముంది. వయాకామ్18 యాజమాన్య సంస్థ రిలయన్స్.. ఈ సారి మీడియా ప్రసార హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించనుందని సమాచారం. చివరకు ఆ సంస్థకే హక్కులు దక్కిన ఆశ్చర్యపోనవరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












