ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ముందుగా మార్క్యూ ప్లేయర్లను వేలం వేయగా.. అర్ష్దీప్ సింగ్తో ఆక్షన్ ప్రారంభమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని పంజాబ్ కింగ్స్ ఆర్టీఎమ్ కార్డ్ సాయంతో రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.
ముందుగా అర్ష్దీప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ధీటుగా బిడ్ వేసింది. మధ్యలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ బిడ్ వేసి అర్ష్దీప్ సింగ్ ధరను అమాంతం పెంచేసాయి. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటాపోటీగా తలపడటంతో అతని ధర రూ. 15.75 కోట్లకు చేరింది. ఈ భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ అర్ష్దీప్ సింగ్ను దక్కించుకోగా.. పంజాబ్ కింగ్స్ ఆర్టీఎమ్ కార్డ్తో రేసులోకి వచ్చింది.

సన్రైజర్స్ హైదరాబాద్ వెనక్కి తగ్గకుండా రూ.18 కోట్లకు బిడ్ వేయగా.. పంజాబ్ కింగ్స్ ఆ ధర చెల్లిస్తామని చెప్పి సొంతం చేసుకుంది. దాంతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన భారత పేసర్గా అర్ష్దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. గత సీజన్లో అర్ష్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్కే ప్రాతినిథ్యం వహించాడు.
IPL 2025 మెగా వేలం హైలైట్స్
అర్ష్దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్టీఎమ్)
కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)