ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్పాట్ కొట్టారు. రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక పలికిన ప్లేయర్గా పంత్ నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26.75 కోట్లు వెచ్చించింది.
మెగా ఆక్షన్ తొలి రోజు మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 72 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 24 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఓవరాల్గా ఈ 72 మంది ఆటగాళ్ల కోసం పది ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి. అన్ని ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 10 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. అలాగే అత్యధికంగా ఎక్కువ మొత్తంగా ఖర్చు చేసింది కూడా పంజాబే. రూ. 88 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ -రెండో రోజుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ మీకోసం..

మొత్తం 126 మంది ఆటగాళ్లు అన్సోల్డ్గా నిలిచిపోయారు.
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. మొత్తం 577 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. తొలి రోజు 72 మంది ఆటగాళ్లు అమ్ముడవ్వగా.. రెండో రోజు 110 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ఆఖరి ప్లేయర్ మోహిత్ రతీని రూ. 30 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ
అర్జున్ టెండూల్కర్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు
అనుకూల్ రాయ్ను రూ. 40 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
రూ. 1.50 కోట్లకు రహానేను కొనుగోలు చేసిన కేకేఆర్
గ్లేన్ ఫిలిప్స్ను రూ. 2 కోట్లకు తీసుకున్న గుజరాత్
మరోసారి అన్సోల్డ్గా నిలిచిన డేవిడ్ వార్నర్
తొలి రోజు అన్సోల్డ్గా నిలిచిన దేవదత్ పడిక్కల్ను ఆర్సీబీ రూ. 2 కోట్ల కనీస ధరకు తీసుకుంది.
వైభవ్ సూర్య వన్షీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు తీసుకుంది.
ఎషాన్ మలింగను రూ.1.20 లక్షలకు తీసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
వైభవ్ సూర్య వన్షిని రూ.కోటీ పది లక్షలకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
సత్యనారయణను రూ. 30 లక్షలకు దక్కించుకున్న ముంబై
అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్
ప్రిన్స్ యాదవ్ను రూ. 30 లక్షలకు తీసుకున్న లక్నో
అనికేత్ వర్మను రూ. 30 లక్షలకు తీసుకున్న సన్రైజర్స్
రాజ్ అంగద్ బావాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
షెమర్ జోసెఫ్ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో
కమిందు మెండీస్ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
జాకెబ్ బెతెల్ను దక్కించుకున్న ఆర్సీబీ
అమ్ముడుపోని సికిందర్ రాజా
అమ్ముడుపోని స్టీవ్ స్మిత్
గుర్జప్నీత్ సింగ్ను రూ. 2.20 కోట్లకు కొన్న సీఎస్కే
ఆకాశ్ సింగ్ను రూ. 30 లక్షలనకు కొనుగోలు చేసిన లక్నో
అశ్వాని కుమార్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై
యుధ్వీర్ సింగ్ను రూ. 35 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
హర్నూర్ పన్నూను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్
అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్
జయదేవ్ ఉనాద్కత్ను కోటీ రూపాయలకు కొనుగోలు చేసిన సన్రైజర్స్
నవీన్ ఉల్ హక్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు
నువాన్ తుషారను రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
ఇషాంత్ శర్మను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
అమ్ముడుపోని ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఉమ్రాన్ మాలిక్కు బిగ్ షాక్.. అన్సోల్డ్గా జమ్మూ ఎక్స్ప్రెస్
స్పెన్సర్ జాన్సన్ను రూ.2.80 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
రోమారియో షెఫర్డ్ను రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
సాయి కిషోర్ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
అజ్మతుల్లా ఒమర్జాయ్ను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
విల్ జాక్స్ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
దీపక్ హుడా రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై
టీమ్ డేవిడ్ను రూ. 3 కోట్లకు తీసుకున్న ఆర్సీబీ
అమ్ముడుపోని మోయిన్ అలీ
షెహ్బాజ్ అహ్మద్ను రూ. 2.40 కోట్లకు తీసుకున్న లక్నో
షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్ను రూ. 2.60 కోట్లకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్
మనీష్ పాండేను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
అమ్ముడుపోని డేవాల్డ్ బ్రెవిస్, ఫిన్ అలెన్
దిగ్వేష్ సింగ్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో
ఎమ్ సిద్దార్థ్ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో
జీషన్ అన్సారీని రూ. 40 లక్షలకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ముఖేష్ చౌదరీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్కే
గుర్నూర్ సింగ్ బ్రార్ను రూ.1.30 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్ స్వప్నిల్ సింగ్ను రూ.50 లక్షలకు ఆర్టీఎమ్ కార్డ్ కింద తీసుకున్న ఆర్సీబీ
దర్షన్ నల్కండేను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ హిమ్మత్ సింగ్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
అన్షుల్ కంబోజ్ను రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే అర్షద్ ఖాన్ను రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
గత సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్కే ఆడిన షేక్ రషీద్. తెలుగు కుర్రాడిని పట్టించుకోని సన్రైజర్స్ హైదరాబాద్
తెలుగు తేజం షేక్ రషీద్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
అన్క్యాప్డ్ బ్యాటర్ శుభ్మన్ దుబేను రూ.80 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
Remaining purse for all teams CSK - Rs. 13.20 crore MI - Rs. 11.05 crore RCB - Rs. 14.15 crore KKR - Rs. 8.55 crore SRH - Rs. 5.15 crore RR - Rs. 6.65 crore PBKS - Rs. 10.90 crore DC - Rs. 3.80 crore GT - Rs. 11.90 crore LSG - Rs. 6.85 crore
అకీల్ హోస్సేన్, విసయకాంత్, ఆదిల్ రషీద్ అన్సోల్డ్
రూ.4.80 కోట్లకు అల్లా గజన్ఫర్ను కొనుగోలు చేసిన ముంబై
అమ్ముడుపోని ముజీబ్ ఉర్ రెహ్మాన్
రూ.2 కోట్ల కనీస ధరకు లాకీ ఫెర్గూసన్ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
రూ. కోట్లకు ఆకాశ్దీప్ను కొనుగోలు చేసిన లక్నోసూపర్ జెయింట్స్
రూ. 9.25 కోట్ల భారీ ధరకు దీపక్ చాహర్ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
ముఖేష్ కుమార్ను ఆర్టీఎమ్ ద్వారా రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
భువనేశ్వర్ కుమార్ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
సౌతాఫ్రికా క్రికెటర్ జెరాల్డ్ కొట్జియను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
తుషార్ దేశ్పాండే రూ. 6.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది
1. మార్కో జాన్సెన్స్ - రూ. 7కోట్లు(పంజాబ్ కింగ్స్) 2. కృనాల్ పాండ్యా - 5.75కోట్లు(ఆర్సీబీ) 3. నితీష్ రాణా - 4.2కోట్లు(రాజస్థాన్ రాయల్స్) 4. వాషింగ్టన్ సుందర్- 3.2కోట్లు(గుజరాత్ టైటాన్స్) 5.జోష్ ఇంగ్లీస్ -రూ. 2.6కోట్లు(పంజాబ్) 6. సామ్ కరణ్ - 2.4కోట్లు(సీఎస్కే)
అమ్ముడుపోని డోనవా ఫెర్రారీయా
అమ్ముడుపోని అలెక్స్ క్యారీ
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్ను రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
తెలుగు తేజం కేఎస్ భరత్కు బిగ్ షాక్ తగిలింది. అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అన్సోల్డ్గా నిలిచాడు.
ర్యాన్ రికల్టన్ను కోటీ రూపాయల అతని బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో అన్సోల్డ్గా నిలిచిన షైహోప్
రూ.4.2 కోట్లకు నితీశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రాణా కోసం ఆర్సీబీ ప్రయత్నించింది
కృనాల్ పాండ్యను ఆర్సీబీ రూ.5.75 కోట్లకు సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆర్టీఎమ్ను ఉపయోగించలేదు
సామ్ కరన్ను సీఎస్కే రూ.2.40 కోట్లకు దక్కించుకుంది. ఆర్టీఎమ్ను పంజాబ్ ఉపయోగించలేదు
వాషింగ్టన్ సుందర్ను గుజరాత్ టైటాన్స్ రూ.3.2 కోట్లకు దక్కించుకుంది. సుందర్ కోసం ఆర్సీబీ ప్రయత్నమే చేయలేదు.
మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా అన్సోల్డ్గా మిగిలిపోయారు
ఆర్సీబీ మాజీ కెప్టెన్ డుప్లెసిస్ను రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది
రోవ్మన్ పావెల్ను కేకేఆర్ కనీస ధర రూ.1.50 కోట్లకు దక్కించుకుంది
మెగా వేలంలో న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ అమ్ముడుపోలేదు
ఫాఫ్ డుప్లెసిస్(దక్షిణాఫ్రికా) : రూ. 2 కోట్లు; అజింక్య రహానె (భారత్): రూ. 1.5 కోట్లు; కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) : రూ.2 కోట్లు; సామ్ కరన్ (ఇంగ్లాండ్) : రూ. 2 కోట్లు; మార్కో యన్సన్ (దక్షిణాఫ్రికా) : రూ. 1.25 కోట్లు; డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) : రూ. 2 కోట్లు; కృనాల్ పాండ్యా (భారత్) : రూ. 2 కోట్లు; వాషింగ్టన్ సుందర్ (భారత్) : రూ. 2 కోట్లు; శార్దుల్ ఠాకూర్ (భారత్) : రూ. 2 కోట్లు; గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్ ): రూ 2 కోట్లు;
సీఎస్కే: రూ. 15.6; డిల్లీ క్యాపిటల్స్: రూ. 13.8; గుజరాత్ టైటాన్స్: 17.5; లక్నో: 14.85; పంజాబ్ కింగ్స్: 22.50
పెట్టిన ఖర్చు: రూ. 89.53 కోట్లు; మిగిలిన డబ్బు: రూ. 30.65 కోట్లు; మిగిలిన ఆర్టీఎమ్: 03; కావాల్సిన ప్లేయర్లు: 16 (విదేశీ ఆటగాళ్లు- 05)
హేజిల్వుడ్ (12.50), ఫిల్ సాల్ట్ (11.50), జితేశ్ (11), లివింగ్స్టన్ (8.75), రసిక్ సలాం (6), సుయాష్ (2.60)
అర్షదీప్ సింగ్ (రూ.18 కోట్లు)- పంజాబ్ కింగ్స్; జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (రూ. 9 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్; నమన్ ధిర్ (రూ.5.25 కోట్లు)- ముంబై ఇండియన్స్; రచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు)- చెన్నై సూపర్ కింగ్స్.
ముంబయి ఇండియన్స్ రిటైన్ ప్లేయర్లు: బుమ్రా (18), సూర్యకుమార్ (16.35), హార్దిక్ (16.35), రోహిత్ (16.30), తిలక్ (8) కొనుగోలు చేసిన ఆటగాళ్లు: బౌల్ట్ (12.50), నమన్ ధీర్ (5.25), రాబిన్ (రూ.65 లక్షలు), కర్ణ్ శర్మ (రూ.50 లక్షలు) పెట్టిన ఖర్చు: రూ. 93.90 కోట్లు మిగిలిన డబ్బు: రూ. 26.10 కోట్లు మిగిలిన ఆర్టీఎమ్: 0 కావాల్సిన ప్లేయర్లు: 16 (విదేశీ ఆటగాళ్లు- 07)
కేకేర్ పెట్టిన ఖర్చు: రూ. 109.95 కోట్లు; మిగిలిన డబ్బు: రూ. 10.05 కోట్లు; మిగిలిన ఆర్టీఎమ్: 0; కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 03)
రిటైన్ ప్లేయర్లు: రింకు (13), వరుణ్ (12), నరైన్ (12), రసెల్ (12), హర్షిత్ (4), రమణ్దీప్ (4); కొనుగోలు చేసిన ఆటగాళ్లు: వెంకటేశ్ అయ్యర్ (23.75), నోకియా (6.50), డికాక్ (3.60), రఘువంశీ (3), గుర్బాజ్ (2), వైభవ్ (1.80), మయాంక్ మార్కండె (రూ.30 లక్షలు)
పెట్టిన ఖర్చు: రూ. 114.85 కోట్లు; మిగిలిన డబ్బు: రూ. 5.15 కోట్లు; మిగిలిన ఆర్టీఎమ్: 01; కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 04)
రిటైన్ ప్లేయర్లు: క్లాసెన్ (23), కమిన్స్ (18), అభిషేక్ (14), హెడ్ (14), నితీశ్కుమార్ (6) కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఇషాన్ కిషన్ (11.25), షమి (10), హర్షల్ (8), అభినవ్ (3.20), రాహుల్ చాహర్ (3.20), జంపా (2.40), సిమర్జీత్ (1.50), అథర్వ (రూ.30 లక్షలు)
ముగిసిన తొలి రోజు వేలం.. 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా 12 మంది ఆటగాళ్లు అమ్ముడుపోలేదు
శ్రేయస్ గోపాల్-అన్సోల్డ్
కుమార్ కార్తీకేయ సింగ్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
పియూష్ చావ్లాను కొనుగోలు చేసేందుకు ముందుకురాని ఫ్రాంచైజీలు. అమ్ముడుపోని జాబితాలోకి చేరిపోయిన చావ్లా
మయాంక్ మార్కండేను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
కర్ణ్ శర్మను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
సుయాశ్ శర్మను రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
సిమర్జీత్ సింగ్ను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే
యశ్ ఠాకూర్ను రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
విజయ్ కుమార్ వైశాఖ్ను రూ. 1.80 కోట్లకు కొనగులు చేసిన పంజాబ్ కింగ్స్
మోహిత్ శర్మను రూ.2.2 కోట్లకు తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఆకాశ్ మధ్వాల్ను రూ. 1.2 కోట్లకు తీసుకున్న రాజస్థాన్ రాయల్స్
రసిక్ దార్ను రూ. 6 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
విష్ణు వినోద్ను రూ. 30 లక్షలకు తీసుకున్న కేకేఆర్
అనూజ్ రావత్ను రూ.30 లక్షలకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్
రాబిన్ మింజ్ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
అషుతోష్ శర్మను రూ.3.80 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిపాల్ లోమ్రోర్ను రూ. 1.70 కోట్లకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్
విజయ్ శంకర్ను రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే
హర్ప్రీత్ బ్రార్ను రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
అబ్దుల్ సమద్ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
నమన్ ధీర్ను రూ. 5.25 కోట్లకు ఆర్టీఎమ్ ద్వారా కొనుగోలు చేసింది.
సమీర్ రిజ్వీని రూ.95 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్కే
నిషాంత్ సింధును రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
అభినవ్ మనోహర్ను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
అభినవ్ మనోహర్ను రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
కరుణ్ నాయర్ను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
అంగ్క్రిష్ రఘువంశీని రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
నెహాల్ వదేరాను రూ.4.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
అథర్వ టైడ్ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
నూర్ అహ్మద్ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే
వానిందు హసరంగాను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
ఆడమ్ జంపాను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
రాహుల్ చాహర్ను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
తీక్షణను రూ. 4.40 కోట్లకు తీసుకున్న రాజస్థాన్ రాయల్స్
ట్రెంట్ బౌల్డ్ను రూ. 12.75 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
టీ నటరాజన్ను రూ.10.75 కోట్లు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఖలీల్ అహ్మద్ను రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే
జోఫ్రా ఆర్ఛర్ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
అన్రిచ్ నోర్జ్ను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
ఆవేశ్ ఖాన్ను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
ప్రసిధ్ కృష్ణను రూ. 9 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
జోష్ హజెల్ వుడ్ను .12.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
జితేశ్ శర్మను రూ. 11 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
ఇషాన్ కిషన్ను రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సన్రైజర్స్
రెహ్మానుల్లా గుర్జాజ్ను రూ. 2 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్
ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్సాల్ట్ను రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
జానీ బెయిర్ స్టోను కొనోగులు చేసేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. దాంతో అన్సోల్డ్గా నిలిచిన ఇంగ్లండ్ వికెట్ కీపర్.
క్వింటన్ డికాక్ను రూ. 3.60 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
గ్లేన్ మ్యాక్స్వెల్ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
రూ. 3.4 కోట్లకు మిచెల్ మార్ష్ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
మార్కస్ స్టోయినీస్ను రూ. 11 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్
వెంకటేశ్ అయ్యర్ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న కేకేఆర్
రవిచంద్రన్ అశ్విన్ను రూ. 9.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసింది.
టీమిండియా పేస్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్ను పంజాబ్ కింగ్స్.. 5.50 కోట్లకు సొంతం చేసుకోగా.. ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 9 కోట్లకు సొంతం చేసుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దాంతో అతను అన్సోల్డ్ లిస్ట్లో చేరాడు. అయితే మరోసారి అతన్ని వేలం వేసే అవకాశం ఉంది.
టీమిండియా యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 3.40 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఎంపికయ్యాడు.రూ. 6.25 కోట్లకు ఆ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేసింది.
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకే కొనుగోలు చేసింది.
దేవదత్ పడిక్కల్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు. దాంతో అతను అన్సోల్డ్గా నిలిచిపోయాడు. మరోసారి అతను వేలంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది.
‘కెప్టెన్సీ గురించి శ్రేయస్ అయ్యర్తో నేను ఇంకా మాట్లాడలేదు. వేలానికి ముందు అతనికి ఫోన్ చేశాను. కానీ అతను ఎత్తలేదు. ఐపీఎల్లో అతను విజయవంతమైన కెప్టెన్. ఢిల్లీ కోచ్గా అతనితో మూడు, నాలుగేళ్లు కలిసి పనిచేశాను. అతను గత సీజన్ విన్నర్ కూడా. మళ్లీ అతనితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతను మా జట్టు తరఫున సత్తా చాటితే నేను చాలా సంతోషిస్తాను.’-రికీ పాంటింగ్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను ఆర్సీబీ పట్టించుకోలేదు. మెగా వేలంలో అతని కోసం రూ. 11 కోట్ల వరకే బిడ్ వేసిన ఆర్సీబీ ఆ తర్వాత తప్పుకుంది. దాంతో అతను రూ. 14 కోట్ల అతి తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకే దక్కించుకుంది. ఆశ్చర్యకరంగా రాహుల్ రూ. 14 కోట్లే పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ను ఆర్సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. గ్లేన్ మ్యాక్స్వెల్కు రిప్లేస్మెంట్గా అతన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను గుజరాత్ టైటార్స్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్టీఎమ్ కార్డ్ కింద అతన్ని తీసుకునేందుకు ఆర్సీబీ నిరాకరించింది.
ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికి స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ను గుజరాత్ టైటాన్స్ రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకుంది.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది. కేకేఆర్తో పోటీపడి మరి దక్కించుకుంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. ఈ క్రమంలో అతను శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు, మిచెల్ స్టార్క్ రూ. 24.752 కోట్ల రికార్డులను అధిగమించాడు.
Rishabh Pant created history in Jeddah. pic.twitter.com/h7jR3BhgNe
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2024
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆర్టీఎమ్ కార్డ్ నయా రూల్ పంత్కు కలిసొచ్చింది. రూ. 20.75 కోట్లకే లక్నో అతన్ని దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించింది. వెంటనే లక్నో రూ. 27 కోట్లకు బిడ్ వేయడంతో ఢిల్లీ వెనకడుగు వేసింది.
గత వేలంలో రూ.24.75 కోట్లు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఈసారి రూ.11.25 కోట్లు మాత్రమే దక్కించుకున్నాడు. స్టార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
జోస్ బట్లర్ను గుజరాత్ జెయింట్స్ రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది
శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత భారీ ధర పలికిన ప్లేయర్గా శ్రేయస్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు స్టార్క్ (రూ.24.75 కోట్లు) పేరిట ఉండేది.
కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. తమ మాజీ ప్లేయర్పై పంజాబ్ కింగ్స్ RTM కార్డ్ ఉపయోగించలేదు
అర్షదీప్ సింగ్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ కోసం తొలుత సీఎస్కే-ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చాయి. అంతిమంగా రాజస్థాన్పై ఎస్ఆర్హెచ్ పైచేయి సాధించి రూ.15.75 కోట్లుకు సొంతం చేసుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించింది. దీంతో సన్రైజర్స్ రూ.18 కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చింది. కానీ ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని చెప్పడంతో అర్షదీప్ను పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది.
ఐపీఎల్ నిర్వాహకులు మెగా వేలం నిబంధనల గురించి అన్ని ఫ్రాంచైజీలకు మరోసారి స్ఫష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే ఐపీఎల్ ఖ్యాతి గురించి వివరిస్తున్నారు
ఆరుగురు చొప్పున ఆటగాళ్లతో రెండు మార్క్యూ లిస్ట్లు ఉన్నాయి. ఎమ్-1లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఎమ్-2లో కేఎల్ రాహుల్, యుజువేంద్ర చాహల్, లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఈ మార్క్యూ లిస్ట్లతో వేలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్రౌండర్లు విభాగాలుగా వేలం జరుగుతుంది. అన్క్యాప్డ్ ప్లేయర్లలోనూ ఇదే తరహా వేలం జరుగుతుంది.
పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక సీఎస్కే- రూ.55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు, కేకేఆర్- రూ. 51 కోట్లు, ఆర్సీబీ- రూ. 83 కోట్లు, లక్నో- రూ. 69 కోట్లు, ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు, ఎస్ఆర్హెచ్- రూ.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్- రూ. 69 కోట్లు ఉన్నాయి.
సీఎస్కే- 01 (క్యాప్డ్, అన్క్యాప్డ్లలో ఎవరినైనా తీసుకోవచ్చు) ఢిల్లీ- 02 (1 క్యాప్డ్ & 1 అన్క్యాప్డ్ / 2 క్యాప్డ్ ) ఆర్సీబీ- 03 (2 క్యాప్డ్ & 1 అన్క్యాప్డ్ / 3 క్యాప్డ్) లక్నో - 01 (క్యాప్డ్) పంజాబ్- 04 (క్యాప్డ్) ముంబై - 01 (అన్క్యాప్డ్) ఎస్ఆర్హెచ్ - 01 (అన్క్యాప్డ్) గుజరాత్- 01 (క్యాప్డ్).
లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే ఒక క్యాప్డ్ ప్లేయర్ ఆర్టీఎమ్ ఉంది.
నికోలస్ పూరన్ (రూ. 21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ. 4 కోట్లు), ఆయుష్ బడోని (రూ. 4 కోట్లు)
కొందరు స్టార్ ఆటగాళ్లకు తక్కువ ధర సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి ఆల్రౌండర్లకు డిమాండ్ ఉండదని క్రికెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. 2027 సీజన్ వరకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగడమే దీనికి కారణమని అంటున్నారు
రుతురాజ్ గైక్వాడ్ (రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 18 కోట్లు), మతీషా పతిరణ (రూ. 13 కోట్లు), శివమ్ దూబే (రూ. 12 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ. 4 కోట్లు)
ఎస్ఆర్హెచ్ వద్ద రూ.45 కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే ఒక ఆర్టీఎమ్ కార్డ్ ఉంది. తమ మాజీ ప్లేయర్లలో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ను ఆర్టీఎమ్ను ఉపయోగించుకుని తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంది.
హెన్రిచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ. 6 కోట్లు)
ఆర్సీబీ వద్ద ఇంకా రూ.83 కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే మూడు ఆర్టీఎమ్ కార్డ్లు ఉన్నాయి. వీటితో ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లు, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ను తీసుకోవచ్చు. లేదా తమ ముగ్గురు మాజీ క్యాప్డ్ ప్లేయర్లను దక్కించుకోవచ్చు.
విరాట్ కోహ్లీ (రూ. 21 కోట్లు), రజత్ పాటిదార్ ( రూ. 11 కోట్లు), యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు)