చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అభిషేక్ శర్మ రికార్డ్ బద్దలు!
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 3 సిక్స్లు బాదడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. తద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డ్ను అధిగమించాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో అభిషేక్ శర్మ 42 సిక్స్లు బాదగా.. వైభవ్ సూర్యవంశీ తాజా సీజన్లో మొత్తం 43 సిక్స్లతో అతన్ని అధిగమించాడు. ఈ జాబితాలో వైభవ్(43), అభిషేక్ శర్మ(42) తర్వాత శ్రేయస్ అయ్యర్(39), విరాట్ కోహ్లీ (38), సూర్యకుమార్ యాదవ్(38) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ 39 సిక్స్లు బాదగా.. విరాట్ కోహ్లీ 2016, 2024లో 38 సిక్స్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 2025లో 38 సిక్స్లు బాదాడు. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరితే వైభవ్ సిక్సర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ధ్రువ్ జురెల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53), కెప్టెన్ రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/40) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, మాధవ్ తివారి రెండేసి వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

