IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. !
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి దుమ్మురేపారు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
కాటేరమ్మ కొడుకులు అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 29 నాటౌట్), ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ల ధాటికి ఆర్సీబీ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. భువనేశ్వర్ కుమార్(0/51)తో పాటు జోష్ హేజిల్ వుడ్(0/55), రసీక్ సలామ్(2/55) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. సుయాష్ శర్మ(1/36), కృనాల్ పాండ్యా(1/24) చెరో వికెట్ తీసారు. ఆర్సీబీపై సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది రెండో అత్యధిక స్కోర్. ఐపీఎల్ 2024 సీజన్లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ 287/3 స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్లో ఆర్సీబీని సన్రైజర్స్ హైదరాబాద్ 165 పరుగుల్లోపు కట్టడి చేయాలి. 90+ పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే మెరుగైన రన్రేట్తో గుజరాత్ టైటాన్స్ను వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాప్-2లో నిలుస్తోంది. తద్వారా క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తోంది. ఆర్సీబీ తమ టాప్-2 ప్లేస్ను పదిలంగా ఉంచుకోవాలంటే కనీసం 165 పరుగులు చేయాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

