ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మరో పరాజయం ఎదురైంది. సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. అయితే సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడమే తమ పతనాన్ని శాసించిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు.
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన పంత్.. తమ లక్ష్యానికి 20-25 పరుగులు అదనంగా చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'మా లక్ష్యం సరిపోదు. మేం 20-25 పరుగులు తక్కువగా చేశాం. అయితే ఆటలో ఇవన్నీ సహజమే. ఇప్పటికీ మా హోమ్ గ్రౌండ్ పరిస్థితులను అంచనా వేస్తున్నాం.

ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం చాలా కష్టం. కానీ మా జట్టులోని ప్రతీ ఒక్కరు మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. స్లో వికెట్పై ఆడాలనుకున్నాం. స్లోయర్ బాల్స్ ఆగి వస్తాయని భావించాను. మేం ఈ గేమ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలి. చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్పలేను.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని(33 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 41), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) తో పాటు నికోలస్ పూరన్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 44)రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(2/39) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, గ్లేన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 69), శ్రేయస్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. నెహాల్ వధేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.