For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 Final: అతని వల్లే ఈ ఓటమి: శ్రేయస్ అయ్యర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఫైనల్లో ఓడినా తమ ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేశారని కొనియాడాడు.

టర్నింగ్ పాయింట్ అదే..
'నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్ళు సందర్భానికి తగినట్లుగా ఆడారు. ఈ మ్యాచ్‌లో ఓడాల్సింది కాదేమో కానీ సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు మా విజయాల్లో భాగమైన ప్రతీ ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి. గత మ్యాచ్ నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఆర్‌సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని అనుభవాన్ని ఉపయోగించి బౌలింగ్ చేశాడు.

IPL 2025 Final Shreyas Iyer Credits Krunal Pandya s Phenomenal Spell as Turning Point in PBKS Loss

మా జట్టులోని ప్రతీ ఆటగాడు రాణించాడు. వారి ప్రదర్శన పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు తొలి సీజన్ ఆడారు. అయినా వారు ఫియర్‌లెస్ గేమ్ ఆడారు. వారు లేకుంటే మేం ఇక్కడి వరకు వచ్చేవాళ్లం కాదు. వారికి అభినందనలు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తాం. మేము ప్రతి మ్యాచ్‌కు గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగాం. వచ్చే ఏడాది కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

శశాంక్ సింగ్ పోరాడినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, June 4, 2025, 1:05 [IST]
Other articles published on Jun 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+