ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోసారి టాపార్డ్ వైఫల్యంతో ఆరెంజ్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఓటమిపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మ్యాచ్కు రామని, సన్రైజర్స్ జట్టును అభిమానించమని భావోద్వేగానికి గురయ్యారు.
ఆటగాళ్లపైకి బాటిల్స్..?
ఈ క్రమంలోనే ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముంబై చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్.. ఆటగాళ్లపై వాటర్ బాటిల్స్ విసిరేసి నిరసన వ్యక్తం చేశారని ఓ ఫేక్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. EpicCommentsTelugu అనే యూజర్.. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యూజర్ ఆర్సీబీ ఫ్యాన్స్ను కొనియాడుతూ మరి ఈ వీడియోను పంచుకున్నాడు.

గ్రోక్ చెప్పిన.. నిజమిదే..!
అయితే ఇది ఫేక్ వీడియో అని, మిస్ లీడింగ్ కంటెంట్ అని ఎక్స్ ఏఐ టూల్ గ్రోక్ స్పష్టం చేసింది. ఈ ఘటన బుధవారం జరిగిన మ్యాచ్లో జరగలేదని, మైదానంలోకి బాటిల్స్ విసిరేసారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని గ్రోక్ స్పష్టం చేసింది. స్టేడియం రూల్స్ ప్రకారం వాటర్ బాటిల్స్ను అనుమతించరని కూడా గ్రోక్ పేర్కొంది. ఈ ఫేక్ వీడియోను నెటిజన్లు నిజమేనని పొరబడుతున్నారు.

Inko 100 years cup kottakunna ni lanti fanbase eh team ki radhu anukunta @RCBTweets pic.twitter.com/mOjzp0lcDI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) April 24, 2025
నిప్పులు చెరిగిన బౌల్ట్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది. హెన్రీచ్ క్లాసెన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 71), అభినవ్ మనోహర్(37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(1), నితీష్ కుమార్ రెడ్డి(2), ప్యాట్ కమిన్స్(1) దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు.

రోహిత్ విధ్వంసం..
అనంతరం ముంబై 15.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, మలింగా, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు.