ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అనూహ్యంగా పుంజుకుంది. ఫస్టాఫ్ సీజన్లో వరుస ఓటములతో చతికిల పడిన ఆర్సీబీ.. సెకండాఫ్లో మాత్రం దుమ్మురేపుతోంది. తొలి 8 మ్యాచ్ల్లో ఒక్క విజయమే నమోదు చేసిన ఆర్సీబీ.. తర్వాతి ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 6 విజయాలు, 12 పాయింట్లతో పాటు 0.387 రన్రేట్తో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్లోని తమ చివరి మ్యాచ్ను ఆర్సీబీ మే 18(శనివారం)న చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడనుంది.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. తమ చివరి మ్యాచ్లో 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలి. లేదా 18.1 ఓవర్లలోనే సీఎస్కే విధించిన లక్ష్యాన్ని చేధించాలి. అప్పుడే సీఎస్కే కంటే మెరుగైన రన్రేట్ సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది.
అంతేకాకుండా సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ చివరి రెండు మ్యాచ్ల్లో ఓడితే ఆర్సీబీతో పాటు, సీఎస్కే ప్లే ఆఫ్స్ 000
ఈ శనివారం జరిగే మ్యాచ్లోనూ కోహ్లీ చెలరేగి సీఎస్కేను ఓడిస్తాడని, తద్వారా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందని అతని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.