
రూ.20.45 కోట్లలో రూ16.25 కోట్లు ఒక్కడికే..
రూ.20.45 కోట్ల పర్స్ మనీతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్న సీఎస్కే స్టోక్స్ ఒక్కడి కోసమే రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. ధోనీ, స్టోక్స్ గతంలో రైజింగ్ పుణే తరఫున ఆడారు. ఇక సీఎస్కే బెస్ట్ ఆల్రౌండర్ డ్వాన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతని స్థానాన్ని సీఎస్కే స్టోక్స్తో భర్తీ చేసింది. స్టోక్స్తో పాటు వ్యూహాత్మకంగా అజింక్యా రహానేను తీసుకుంది. సత్తా ఉన్న అనామక ఆటగాళ్లపై కూడా సీఎస్కే ఫోకస్ పెట్టింది. తెలుగు తేజం షేక్ రషీద్, నిషాంత్ సింధు, అజయ్ మండల్, భగత్ వర్మలను తీసుకొని 25 మంది సభ్యులతో జట్టును పూర్తి చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ప్లేయర్స్..
మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), అంబటి రాయుడు, దీపక్ చాహర్, డేవాన్ కాన్వే, డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, మతీష పతీరాణ, మిచెల్ సాంట్నర్, మోయిన్ అలీ, ముఖేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, రాజవర్థన్ హంగార్గేకర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబే, సిమర్జీత్ సింగ్, సుభ్రాన్షు సేనపతి, తుషార్ దేశ్పాండే
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు), షేక్ రషీద్(రూ.20 లక్షలు), అజింక్యా రహానే(రూ.50 లక్షలు), నిశాంత్ సింధు(రూ.60లక్షలు), కైల్ జెమీసన్(రూ. కోటి), అజయ్ మండల్(రూ.20 లక్షలు), భగత్ వర్మ(రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications












