
బలంగా స్పిన్ విభాగం..
ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నలుగురు పేసర్లతోనే బౌలింగ్ విభాగాన్ని నెట్టుకొచ్చింది. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ పవర్ ప్లే, డెత్ ఓవర్ల బాధ్యతలు మోయగా.. ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగీ, మార్కో జాన్సె, ఫజలక్ ఫరూకీ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేశారు. అయితే స్పిన్ విభాగం మాత్రం హైదరాబాద్కు లోటుగా మారింది. రషీద్ ఖాన్ను వదిలేసుకున్న తర్వాత ఆ స్థాయి ప్లేయర్ను తీసుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్లతో స్పిన్ విభాగాన్ని నెట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, అకీల్ హోస్సెన్లను తీసుకొని ఆ బలహీనతకు చెక్ పెట్టింది. దేశవాళీలో రాణించిన వివ్రాంత్ శర్మను భారీ ధరకు సన్రైజర్స్ కొనుగోలు చేయగా.. అతను పార్ట్టైమ్ స్పిన్నర్గా జట్టుకు ఉపయోగపడనున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ దగర్ కూడా ఉండటంతో స్పిన్ విభాగం పటిష్టంగా మారింది.

బలంగా మిడిలార్డర్ బ్యాటింగ్..
గత సీజన్లో ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠిలు సన్రైజర్స్ మిడిలార్డర్ బాధ్యతలు మోసారు. అయితే పూరన్ విఫలమ్వవడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. దాంతో అతనిపై వేటు వేసిన సన్రైజర్స్ హెన్రీచ్ క్లాసెన్తో భర్తీ చేసింది. అంతేకాకుండా సూపర్ ఫామ్లో ఉన్న హరీ బ్రూక్ను తీసుకొని బ్యాటింగ్ను మరింత బలోపేతం చేసింది. మయాంక్ అగర్వాల్ చేరికతో టాపార్డర్ కూడా పటిష్టంగా మారింది. గ్లేన్ ఫిలిప్స్ రూపంలో బ్యాకప్ కూడా బలంగానే ఉంది.

కెప్టెన్సీ ఆప్షన్స్కు సత్తా ఉన్నోళ్లు..
గత సీజన్లో కేన్ విలియమ్సన్ జట్టును నడిపించగా.. సన్రైజర్స్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో అతన్ని వదిలించుకున్న ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్సీ కోసం సత్తా ఉన్న ఆటగాళ్లను తీసుకుంది. పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్.. తమ తదుపరి కెప్టెన్గా అతన్నే నియమించే అవకాశం ఉంది. అతనితో పాటు ఎయిడెన్ మార్క్రమ్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ పేర్లను కూడా సన్రైజర్స్ మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. అలాగే బ్రూక్, క్లాసెన్ వంటి మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేసింది. వీరి చేరికతో సన్రైజర్స్ డేంజరస్గా మారింది.


Click it and Unblock the Notifications












