సోషల్ మీడియాలో హాట్ టాపిక్..
అయితే ఈ రిటైన్ విధానంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సెటైరికల్ ట్వీట్స్తో పాటు సరదా మీమ్స్ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రిటైన్ పాలసీ రూల్స్పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం పటిష్టంగా ఉన్న టీమ్స్ పరిస్థితేంటని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా ఐపీఎల్లోని ప్రస్తుత జట్లు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయో కూడా అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. కొంతమంది తమ అభిప్రాయం చెబితే మరికొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటారని వాదిస్తున్నారు. దాంతో ఈ మెగా వేలం టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
మాకు కావ్య మారన్ కావాలి..
కొంతమంది అభిమానులు చిలిపిగా కామెంట్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. తాజా నిబంధన కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ ముగ్గురిలో తమకు నచ్చిన వారిని తీసుకున్నా.. తీసుకోకపోయినా.. అది వాళ్ల ఇష్టమని, కానీ ఓనర్గా కావ్య మారన్ను మాత్రం రిటైన్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైదానంలో కావ్య పాప ఎక్స్ప్రెషన్స్.. నవ్వులు తమకు కావాలని.. ఆమె లేకుంటే తామెన్నో మిస్సవుతామని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్లో కావ్య మారన్ ప్రతీ మ్యాచ్కు హాజరై అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. టీమ్ ఓడిపోయిందనే బాధ కంటే కావ్య పాప బాధపడుతుందనే అభిమానులు నొచ్చుకున్నారు.
ముంబై మునిగినట్లే..
ఇక తాజా నిబంధనతో పటిష్ట ముంబై ఇండియన్స్ పని ముగిసినట్లేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ స్ట్రాంగ్ టీమ్ను తయారు చేసుకున్న ఆ ఫ్రాంచైజీపై బీసీసీఐ కోలుకోలేని దెబ్బకొట్టిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ రూల్ గురించి విన్నాక ముంబై ఫ్రాంచైజీ బాధ వర్ణాతీతమని, కన్నీళ్లతో చెరువే నిండిపోయిందని ఫన్నీమీమ్ క్రియేట్ చేశారు. ఇక ఆదాని గ్రూప్ ఒక జట్టు కొంటే..ఫైనల్లో ఆదాని X అంబాని జట్లు తలపడితే.. చూడటానికి బాగుంటుందని మరో అభిమాని ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్ 2021 సెకండాఫ్ కంటే మెగా వేలంపైనే సర్వత్రా ఆసక్తినెలకొంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఫ్రాంచైజీ విలువ రూ. 2వేల కోట్లు
ఇక కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండొచ్చనేది నిపుణుల అంచనా. ఈ రెండు నయా టీమ్స్కు సంబంధించి టెండర్స్ ప్రక్రియను బీసీసీఐ ఆగస్టులో చేపట్టనుంది. డిసెంబర్లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. మీడియా హక్కుల ఒప్పందం కూడా జరగనుంది. ప్రస్తుత వివో ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications












