For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 షెడ్యూల్ అప్‌డేట్ .. తొలి, ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?

IPL 2021 will start on 11th April, Final Match on 6th June
IPL 2021 Dates and Schedule: IPL 2021 likely to start from 11 April, Final on 6 June

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సీజన్‌ కోసం ఫిబ్రవరి 18న చెన్నైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మినీ వేలాన్ని నిర్వహించనుంది. జనవరి 20తోనే ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా.. ఆయా ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇక జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4తో ముగియనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. తాజాగా సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగనుందని సమాచారం తెలుస్తోంది.

ఏప్రిల్ 11న తొలి మ్యాచ్

ఏప్రిల్ 11న తొలి మ్యాచ్

ఫిబ్రవరి 5 నుంచి భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య వరుసగా నాలుగు టెస్టుల, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. చెన్నై, అహ్మదాబాద్‌, పూణే వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ ఫిబ్రవరి 5న మొదలై.. మార్చి 28తో ముగుస్తుంది. ఈ సిరీస్ ముగిసిన 13 రోజుల తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌ మ్యాచ్‌లను బీసీసీఐ ప్రారంభించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏప్రిల్ 11న తొలి మ్యాచ్, జూన్ 6న ఫైనల్ మ్యాచ్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఐపీఎల్ 2021 షెడ్యూల్ అధికారికంగా విడుదలకానుంది.

మళ్లీ ఐపీఎల్ బయో-బబుల్‌లోకి

మళ్లీ ఐపీఎల్ బయో-బబుల్‌లోకి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్‌ మొత్తాన్ని యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి భారత్‌ గడ్డపైనే ఐపీఎల్ 2021 సీజన్‌ని నిర్వహించబోతున్నారు. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత వారం రోజుల పాటు భారత ఆటగాళ్లకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఆ తర్వాత ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్ బయో-బబుల్‌లోకి వచ్చి ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. విదేశీ క్రికెటర్లు కూడా భారత్‌కి వచ్చి ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఐపీఎల్ టోర్నీకి ముందు ఆటగాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించే దిశగా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

ప్రత్యామ్నాయ వేదిక ఆలోచనే లేదు

ప్రత్యామ్నాయ వేదిక ఆలోచనే లేదు

ఐపీఎల్‌-2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌ ధుమాల్‌ స్పష్టం చేశారు. ఈ సారి కచ్చితంగా భారత్‌లోనే నిర్వహించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 'ఐపీఎల్‌ ఎక్కడ జరపాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. భారత్‌లో నిర్వహించగల వనరులు మాకు ఉన్నాయని నమ్ముతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ వేదిక అనే ఆలోచనే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈ కంటే భారత్‌లోనే పరిస్థితులు బాగున్నాయి. ఇదే కొనసాగి ఇక్కడే ఐపీఎల్‌ జరగాలని కోరుకుందాం' అని అన్నారు.

India vs England: హర్భజన్‌ రికార్డ్‌పై కన్నేసిన అశ్విన్.. మరో 12 వికెట్లు తీస్తే!!

Story first published: Monday, February 1, 2021, 15:53 [IST]
Other articles published on Feb 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+