For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: కరోనా పరీక్షల్లో నెగటీవ్.. సతీ సమేతంగా దుబాయ్ చేరిన రోహిత్, సూర్య, బుమ్రా!

IPL 2021: Rohit Sharma, Suryakumar Yadav and Jasprit Bumrah arrives UAE

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సతీ సమేతంగా అబుదాబిలో అడుగుపెట్టారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుతో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు.. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌ల కోసం ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో యూఏఈకి చేరుకున్నారు. అయితే ఇంగ్లండ్ నుంచి వచ్చే ముందు ఈ ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగటీవ్ వచ్చిందని, దాంతోనే ప్రత్యేక విమానంలో అబుదాబికి తీసుకొచ్చామని ముంబై ఇండియన్స్ ప్రకటించింది.

అబుదాబికి చేరుకున్న రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ల ఫొటోలను కూడా ట్వీట్ చేసింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అబుదాబి వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. బీసీసీఐ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు వారం రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత జట్టుతో కలవనున్నారు.

అందరికీ నెగటీవ్..

'భారత జట్టులోని ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు సూర్యకుమార్ యాదవ్‌లు సతీసమేతంగా ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఈ రోజు(శనివారం) ఉదయం అబుదాబికి చేరుకున్నారు. వీళ్లంతా ఐపీఎల్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ప్రయాణానికి ముందు అందరికి ఆర్‌‌టీపీసీఆర్ పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. అబుదాబి చేరుకున్న తర్వాత మరోసారి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయగా మళ్లీ నెగటీవ్ వచ్చింది'అని ముంబై ఇండియన్స్ పేర్కొంది.

కరోనా కలకలం..

షెడ్యూల్ ప్రకారం 5వ టెస్టు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 14 లేదా 15న యూఏఈకి బయలుదేరాల్సి ఉంది. కానీ భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆఖరి టెస్ట్ రద్దయింది. దాంతో భారత ఆటగాళ్లు ముందుగానే యూఏఈకి పయనమయ్యారు. టెస్ట్ సిరీస్ సజావుగా జరుగుంటే.. ఆటగాళ్లు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండానే బబుల్ టు బబుల్ నేరుగా జట్టుతో కలిసేవారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా వైరస్ బారనపడటం.. అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ కూడా పాజిటీవ్ తేలడం.. ఐదో టెస్ట్‌కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా ప్రాణంతక వైరస్ సోకడంతో చివరి మ్యాచ్ రద్దయింది.

నెగటీవ్ వచ్చినా..

ఇక యోగేశ్ పర్మార్‌కు రోహిత్ శర్మ సన్నిహితంగా ఉండటం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది. హిట్‌మ్యాన్‌కు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ రావడంతో ముంబై ఫ్రాంచైజీతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆరు రోజుల క్వారంటైన్‌లో అతను పాజిటీవ్‌గా తేలితే దాదాపు ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ మ్యాచ్‌లన్నీ దూరం కానున్నాడు. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అందరికి నెగటీవ్ వచ్చినప్పటికీ.. సాధారణంగా కరోనా లక్షణాలు మూడు, నాలుగు రోజు తర్వాత బయటపడతాయి. ఇప్పుడు ఇదే అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది.

రేపు కోహ్లీ, సిరాజ్..

రేపు కోహ్లీ, సిరాజ్..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మహమ్మద్‌ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లీ, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లీ, సిరాజ్‌లు చార్టర్‌ ఫ్లైట్‌ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.

Story first published: Saturday, September 11, 2021, 16:39 [IST]
Other articles published on Sep 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+