చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్సీబీ 38 పరుగుల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 78), ఏబీ డివిలియర్స్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 76 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ప్రసిధ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆండ్రూ రస్సెల్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడేక్రమంలో కేకేఆర్ బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ఆర్సీబీ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు, చాహల్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. సుంధర్కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లోకి దూసుకెళ్లింది.