
మనీష్ పాండే రావాలి..
'సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ మనీష్ పాండేను జట్టులోకి తీసుకురావాలి. పాండేలాంటి అనుభవం కలిగిన ఆటగాడు హైదరాబాద్కు అవసరం. అయితే కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో పాండేను మూడో స్థానంలో ఆడించలేమనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ గతేడాది 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన మనీష్ పాండే అద్భుతంగా రాణించాడు. కాబట్టి ఈ ఏడాది కూడా అలానే అతన్ని బ్యాటింగ్కు పంపించాలి. మీరంతా అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని విమర్శించవచ్చు. కానీ అతను పరుగులు చేశాడనే విషయాన్ని మరవద్దు. కాబట్టి మనీష్ పాండే వంటి అపార నైపుణ్యం కలిగిన ఆటగాడు హైదరాబాద్కు ఆడటం చాలా ముఖ్యం. 'అని దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు.

సుచిత్ను కొనసాగించాలి..
ఇక భువీ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తే అభిషేక్ శర్మను బెంచ్కు పరిమితం చేయాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. జగదీష సుచిత్ను మాత్రం జట్టులో కొనసాగించాలని, అతను మంచి టెంపర్మెంట్తో ఆడుతున్నాడని తెలిపాడు. 'విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్ ఇప్పటికే చాలా అవకాశాలు పొందారు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వస్తే మాత్రం సుచిత్ను పక్కనపెట్టవద్దు. ఎందుకంటే అతను మంచి టెంపర్మెంట్తో ఆడుతున్నాడు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. అతనికి ప్రత్యామ్నాయంగా ఉన్న అభిషేక్ శర్మను బెంచ్కు పరిమితం చేయాలి'అని దీప్దాస్ సూచించాడు.

రెండు హాఫ్ సెంచరీలు చేసినా..
మనీష్ పాండే ఈ సీజన్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించినా జట్టుకు విజయాన్నందించలేకపోయాడు. అంతేకాకుండా అతని నెమ్మదైన బ్యాటింగ్, స్ట్రైక్రేట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పించిన సన్రైజర్స్ టీమ్మేనేజ్మెంట్ విరాట్ సింగ్కు అవకాశం ఇచ్చింది. కానీ అతను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. దారుణంగా విఫలమయ్యాడు. అతనితో పాటు కేదార్ జాదవ్ సైతం ఆశించిన ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఇక హైదరాబాద్ 5 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.


Click it and Unblock the Notifications












