
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన ఈ ఆసీస్ క్రికెటర్పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తికనబర్చలేదు. కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడినప్పటికీ భారీ ధరను వెచ్చించేందుకు వెనుకడుగు వేసాయి. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షల స్వల్ప ధరకు కొనుగోలు చేసింది.
గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించిన స్టీవ్ స్మిత్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయాడు. దాంతో ఆ ఫ్రాంచైజీ అతన్ని వదులుకొని సంజూ శాంసన్ను కెప్టెన్గా నియమించుకుంది. అయితే స్మిత్ భారీ ధరకు పలుకుతాడని అంతా భావించినా ఊహించని విధంగా స్వల్ప ధరకే అమ్ముడుపోయాడు. ఏ విధంగా చూసుకున్న స్టీవ్ స్మిత్ స్థాయికి ఇది చాలా తక్కువ. ఇక ఆరోన్ ఫించ్, అలెక్స్ క్యారీ, కరుణ్ నాయర్, హనుమ విహారీలపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు.