
అదే క్రేజ్.. అదే ఫాలోయింగ్..
అయినా ఆ జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. కారణం విరాట్ కోహ్లీనే. ఇప్పటికీ ఆ జట్టు టైటిల్ ఫేవరేటే. ఇన్నేళ్ల పాటు ఆర్సీబీకే ఆడిన కోహ్లీ.. ఎట్టి పరిస్థితుల్లో ఆ జట్టును వీడనని స్పష్టం చేశాడు. కనీసం ఆర్సీబీ ఫ్రాంచైజీని వదిలేయాలని ఆలోచన కూడా ఏనాడు రాలేదన్నాడు. దానికి ఆర్సీబీ యాజమాన్యం చూపెట్టే ప్రేమే కారణమన్నాడు. అప్కమింగ్ ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపిన కోహ్లీ.. ఆర్సీబీ జట్టుతో ఉన్న విడదీయని బంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు. టైటిల్ నెగ్గడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.

అంతిమ లక్ష్యం అదే..
‘ఆర్సీబీతో నా బంధానికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదో అద్భుతమైన ప్రయాణం. మా టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ.. ఆర్సీబీ అంతిమ లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నాం. గతంలో మూడు సార్లు దగ్గరగా వచ్చి టైటిల్ను తృటిలో చేజార్చుకున్నాం. టైటిల్ గెలవడం అనేది ఎప్పుడూ మా కలనే. ఇక ఆర్సీబీ అంటే ఇష్టం. జట్టును వీడాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ చూపించే ప్రేమ, కేరింగ్ అలాంటింది.

జట్టును వదలను..
ఈ సీజన్ బాగా ఆడుతామా లేదా అనే ఆందోళన అందరికి ఉంటుంది. కానీ బెంగళూరు జట్టు పట్ల విధేయత చూపాలి. ఆర్సీబీ అద్భుతమైన జట్టు. నేను ఐపీఎల్ను వీడేంత వరకు.. మా ప్రదర్శన ఎలా ఉన్నా.. జట్టును మాత్రం వదిలిపెట్టను.'అని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇక గత 12 సీజన్లలో ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయింది. 2009, 2016 సీజన్లలో ఫైనల్కు చేరిన ఆ జట్టు రెండు హైదరాబాద్ జట్లు(సన్ రైజర్స్, డెక్కన్ చార్జెస్) చేతిలోనే ఓడింది. 2015లో ప్లేఆఫ్లో వెనుదిరిగింది.

ఐదు నెలల తర్వాత..
‘దాదాపు ఐదు నెలల క్రితం నెట్ ప్రాక్టీస్ చేశాను. సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ కోసం చివరిసారి ప్రాక్టీస్ చేశాను. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఆడలేదు.ఇక లక్నోలో జరగాల్సిన వన్డే నాటికి పరిస్థితి మారిపోయింది. కానీ పరిస్థితులు అలా వచ్చినందుకు నేనేమీ ఫీల్ కాలేదు. సుదీర్ఘం విరామం తర్వాత ప్రాక్టీస్ చేయడంతో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఈ సీజన్ ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉన్నాం' అని కోహ్లీ తెలిపాడు. గత 10 సీజన్లుగా జట్టును నడిపిస్తున్న కోహ్లీ.. జట్టుకు టైటిల్ అందించకపోయినా.. ఆర్సీబీ అతని కెప్టెన్సీపై వేటు వేయలేదు. ఇదే కోహ్లీని కట్టిపడేసింది.


Click it and Unblock the Notifications
