లారా జోస్యం:
పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతూ మంచి జోరుమీదుంది ముంబై ఇండియన్స్. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఈరోజు రాత్రి మ్యాచ్లో చెమటోడ్చాల్సి వస్తుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. అయితే సులువుగా ముంబైని హైదరాబాద్ ఓడించేస్తుందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత బ్రియాన్ లారా జోస్యం చెప్పాడు. ముంబైతో జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలు చేయనుందని అంటున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై సీనియర్ ఆటగాళ్లకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని, అది సన్రైజర్స్కి మరింత కలిసిరానుందన్నాడు. లారా ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం వ్యాఖ్యాతల బృందంలో ఉన్నాడు.
ముంబైని హైదరాబాద్ ఓడిస్తుంది:
తాజాగా బ్రియాన్ లారా మాట్లాడుతూ... 'షార్జాలో ముంబైని హైదరాబాద్ ఓడిస్తుంది. గత కొన్ని మ్యాచ్లుగా సన్రైజర్స్ టీమ్లోని ఆటగాళ్లు ఫామ్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మ్యాచ్లోనూ వాళ్లు సత్తాచాటే అవకాశం ఉంది. ముంబై ఈ మ్యాచ్లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్లో టాప్ స్థానంలో నిలిచి ప్లేఆఫ్ చేరిన ముంబై ఈ మ్యాచ్ను పెద్దగా పట్టించుకోదనే అనుకుంటున్నా. ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు ముంబై తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎస్ఆర్హెచ్కు లాభం చేకూర్చనుంది. దీనిని వినియోగింకొని ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుందనే అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.
హైదరాబాద్ గెలిస్తే.. కోల్కతా ఇంటికి:
ముంబై ఇప్పటి వరకూ 13 మ్యాచ్లాడి 9 మ్యాచ్ల్లో గెలుపొందింది. హైదరాబాద్ 13 మ్యాచ్లకిగానూ ఆరింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోతే.. ఏడు విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న కోల్కతా చివరి ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంది. ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే.. అప్పుడు కోల్కతా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఐపీఎల్ 2019 సీజన్లో ప్లేఆఫ్ ఆఖరి బెర్తుని లీగ్ దశ చివరి రోజున హైదరాబాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ ఈరోజు లీగ్ దశ మ్యాచ్లు ముగియనున్నాయి. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.
అనుష్క జీ.. మునుపెన్నడూ లేనంతగా అందంగా ఉన్నారు!! ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్న క్యూట్ ఫోటోస్!