
షార్జా: కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఏబీ డివిలియర్స్(33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్లతో 73 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీకి తోడు ఆరోన్ ఫించ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 47), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 1 ఫోర్తో 33 నాటౌట్) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరొక వికెట్ తీశారు.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి ఓపెనర్లు ఫించ్, దేవదూత్ పడిక్కల్(23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ 32) మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ రస్సెల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఫించ్కు కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్ రొటేట్ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్లు రాకపోవడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. దాంతో ఒత్తిడికి లోనైన ఫించ్ ప్రసిద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
ఈ పరిస్థితుల్లోక్రీజ్లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్రేట్ను అమాంతం పెంచేసాడు. మరోవైపు ఏబీడీకి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చిన కోహ్లీ 25వ బంతికి తొలి బౌండరీ సాధించాడు.