దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. టాస్తో పనిలేదని, తాము కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ చెప్పాడు.
ముంబై వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. వరుస పరాజయాలతో పంజాబ్ అట్టడుగున ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఢిల్లీతో రోహిత్సేన దాగుడుమూతలు ఆడుతోంది. మరోసారి పంజాబ్ను చిత్తుచేసి అగ్రస్థానానికి ఎగబాకాలని చూస్తోంది. ఇక చివరి స్థానంలో ఉన్న పంజాబ్ గత మ్యాచ్ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మధ్య జరిగిన 25 మ్యాచుల్లో ముంబై 14 విజయాలు సాధించింది. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లోనూ పంజాబ్ మీద రోహిత్ సేనదే పైచేయి. దబాయ్ వేదికగా ముంబై జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచింది. ఒక మ్యాచులో మాత్రమే ఓడింది. పంజాబ్ ఐదు మ్యాచ్లాడి రెండింట్లో గెలిచి మూడింట్లో ఓటమిపాలైంది.
తుది జట్లు:
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, కౌల్టర్ నైల్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, క్రిష్ణప్ప గౌతమ్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.