
ఉతప్పకు వార్నింగ్
టాప్ ఆర్డర్తో పాటు మిడిలార్డర్ వైఫల్యం కూడా రాజస్థాన్ ఓటములకు ప్రధాన కారణం. మిడిలార్డర్లో రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. దీంతో మంగళవారం ముంబై ఇండియన్స్తో జరగనున్న పోరుకు ముందు కోల్కతా నైట్రైడర్స్ మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. పరాగ్, ఉతప్పకు వార్నింగ్ ఇచ్చాడు. మిడిలార్డర్లో ఉతప్ప లాంటి అనుభవం ఉన్న ఆటగాడు అంచనాలను అందుకోవాలని సూచించాడు. ఫామ్ అందుకోకుంటే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం పొంచివుందని హెచ్చరించాడు. ఇక బెన్ స్టోక్స్ తిరిగి రావడంతో రాజస్థాన్ జట్టు జాతకం పూర్తిగా మారిపోతుందని గౌతీ అభిప్రాయపడ్డాడు.

సమయం మించిపోతోంది
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్కు సమయం మించిపోతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు ఉతప్ప ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. అతడు సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఉతప్ప మ్యాచ్లను తనదైన శైలిలో ముగిస్తాడు. అందుకే అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. మ్యాచ్లను ముగించలేకపోయినా.. మిడిల్ ఆర్డర్లో అతడు ఊపు తేవాలి' అని అన్నాడు. ఐపీఎల్ 2020లో ఉతప్ప ఇప్పటివరకు నాలుగు మ్యాచులలో 5, 9, 2, 17 రన్స్ చేశాడు.

స్టోక్స్ తిరిగి జట్టులోకి వస్తే
'రాబిన్ ఉతప్పతతో పాటు రియాన్ పరాగా్ కూడా ఫామ్లో లేడు. బెంచ్ మీదున్న ఆటగాళ్లు సత్తా చాటడానికి ఎదురుచూస్తున్నారు. బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి వస్తే.. కాంబినేషన్ పూర్తిగా మారిపోతుంది. ఒకానొక సమయంలో పోటీ ఎదురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ఇద్దరు ఫామ్లో రావాలి' అని గౌతమ్ గంభీర్ సూచించాడు. 'రాజస్థాన్ ఎక్కువగా జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్లపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒకవేళ వారు విఫలమయితే సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మిడిల్ ఆర్డర్ను పటిష్టం చేసుకోవాలి' అని గౌతీ చెప్పుకొచ్చాడు.

కార్తీక్ ఆరో స్థానంలో ఆడాలి
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. అతను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు ఎందుకొస్తున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పందిస్తూ... 'రాహుల్ త్రిపాఠిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలి. కార్తీక్ ఆరో స్థానంలో ఆడాలి. మోర్గాన్, రసెల్ల కన్నా ముందు బ్యాటింగ్కు దిగొద్దు. నరైన్ను ఎనిమిది లేదా తొమ్మిదో స్థానంలో ఆడించాలి. మోర్గాన్ 4లో, రసెల్ 5లో రావాలి. ఆ తర్వాత కార్తీక్ దిగాలి' అని చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కారు అయితే.. మేం ముగ్గురమే ఇంజిన్.. ఇంధనం ఎక్కిస్తే దూసుకుపోతాం: పోలార్డ్


Click it and Unblock the Notifications












