న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్పై ఆ జట్టు మాజీ కెప్టెన్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అతను సాధించిన ఘనత అమోఘమన్నాడు. ఈ ఫీట్ మరే భారత ఆటగాడికి సాధ్యం కాలేదని, ఐపీఎల్లోనే ఏ ఆటగాడు కూడా ఈ రికార్డు సాధించలేదని కొనియాడాడు. శిఖర్ సూపర్ ఫామ్ ఢిల్లీ జట్టుకు కలిసి వస్తుందని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షోలో మాట్లాడుతూ ఈ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
'బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, అది టీ20ల్లో అద్భుతం. ఈ ఘనతను అందుకోవడం మాములు విషయం కాదు. మరే భారత ఆటగాడి వల్ల కాలేదు. వాస్తవానికి ఐపీఎల్లోనే ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ధావన్ ఈ ఘనతను అందుకున్న టైమ్. ఢిల్లీ జట్టు పీక్స్లో ఉన్నప్పుడు నమోదు కావడం విశేషం. ఇలా అనుభవజ్ఞుడైన ఆటగాడు సూపర్ ఫామ్లో ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ జట్టు ఓపెనర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడం, అంతుకు ముందు మ్యాచ్ల్లో 69, 57 హాఫ్ సెంచరీలు సాధించడం పెద్ద సానుకూలంశం. 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
11 మ్యాచ్ల్లో 7 విజయాలతో టాప్-2లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపు ప్లే ఆఫ్కు చేరినట్టే. అయితే టేబుల్ టాపర్గా నిలవాలని శ్రేయస్ సేన భావిస్తోంది. మరికొద్ది క్షణాల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మరో పోరుకు సిద్దమైంది.
నీ భార్యను 14 రోజులు ఇవ్వూ... బెన్ స్టోక్స్పై వెస్టిండీస్ క్రికెటర్ అసభ్య పదజాలం!