
ఇలా జరిగితే టేబుల్ టాపర్ ధోనీనే..
లీగ్లో ధోనీ సేన ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నేడు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్తో సహా మిగిలిన నాలుగు మ్యాచ్లు నెగ్గితే చెన్నై ప్లే ఆఫ్ చేరుకుంటుందని చెన్నై ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇతర మ్యాచ్ల్లో కూడా తాము అంచాన వేసే జట్లు గెలిస్తే సీఎస్కే టేబుల్ టాపర్గా నిలవడంలో ఎలాంటి సందేహం ఉండదంటున్నారు.

ప్లే ఆఫ్
KXIP vs DCలో పంజాబ్, KKR vs RCBలో కోల్కతా, RR vs SRHలో హైదరాబాద్, KKR vs DCలో కోల్కతా, KXIP vs SRHలో హైదరాబాద్, RR vs MIలో రాజస్థాన్, KKR vs KXIPలో పంజాబ్, SRH vs DCలో హైదరాబాద్, MI vs RCBలో బెంగళూరు, KXIP vs RRలో పంజాబ్, DC vs MIలో ఢిల్లీ, RCB vs SRHలో హైదరాబాద్, KKR vs RRలో రాజస్థాన్, DC vs RCBలో బెంగళూరు, SRH vs Miలో ముంబై గెలిస్తే 16 పాయింట్లతో చెన్నై టాపర్గా.. డీసీ, కేకేఆర్, హైదరాబాద్ మూడు జట్లు ప్లే ఆఫ్ చేరుతాయంటున్నారు.
నాలుగో స్థానంలోనైనా..
ఇలా కాకుండా.. చెన్నై ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచి.. ఢిల్లీ మిగతా 5 మ్యాచ్ల్లో మూడు గెలిచి రెండు ఓడాలని.. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ కూడా మరో మూడు మ్యాచ్ల్లో గెలిస్తే నాలుగో జట్టుగా 16 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్కు చేరుతుదంటున్నారు. ఇది జరగాలంటే కేకేఆర్ మిగతా 5 మ్యాచ్ల్లో ఒకటి కూడా గెలవద్దని, హైదరాబాద్ మూడు, పంజాబ్ ఒకటి, రాజస్థాన్ 2 మాత్రమే గెలవాలని కోరుకుంటున్నారు. ఇదే జరిగితే ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ, చెన్నై టాప్-4గా ప్లే ఆఫ్ చేరుతాయంటున్నారు.
ఫన్నీ ట్రోల్స్..
ఇక చెన్నై అభిమానులు ప్రస్తుత పరిస్థితిపై నెట్టింట ఫన్నీ మీమ్స్, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. గత మూడు సీజన్లుగా ఆర్సీబీ వైఫల్యం చెందగా ఆ జట్టు అభిమానులు కూడా ఇలానే బాధపడ్డారు.ఇప్పుడు చెన్నై ఫ్యాన్స్ ఆ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే అప్పట్లో ఆర్సీబీ వాళ్లు కూడా ఈ రకంగానే లెక్కలు కట్టేవారు. దాంతో వారి దగ్గరకు వెళ్లి ప్రెడిక్షన్ టేబుల్ నేర్చేకోమని సెటైర్స్ వేస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ పర్వాలేదనిపిస్తుంది. 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో మూడో స్థానంలో సేఫ్గా ఉంది.


Click it and Unblock the Notifications












