
హైదరాబాద్: మరో మూడు రోజుల్లో మొదలు కాబోతున్న ఐపీఎల్కు బీసీసీఐ అన్ని రకాల సిద్ధమైంది. అంతేకాదు లీగ్కు సంబంధించిన టిక్కెట్లను ఆయా జట్లు విక్రయానికి కూడా పెట్టేశారు. అసలే రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్ సీజన్లో పునరాగమనం చేయబోతున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
అదే స్థాయిలో చెన్నై జట్టు నిర్వహకులు కూడా మ్యాచ్పై అంచనాలు పెంచే విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా సీజన్లో మొదటి మ్యాచ్గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 7న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో కాలా ధోనీ అంటూ ప్రచారం చేస్తున్న చెన్నై జట్టు టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా అన్ని అభిమానులు వెదుకులాట ప్రారంభించారు.
టిక్కెట్ల ధరలు:
ఒక్కో మ్యాచ్ రూ. 500 నుంచి రూ.26000వరకూ:
ఎక్కడ దొరుకుతాయో అన్న సందేహమే లేదు. ఈ టిక్కట్లు ప్రముఖ వాణిజ్య సంస్థకు చెందిన యాప్ bookmyshowలోనూ అందుబాటులో ఉంటాయి. అంతేగాక, మ్యాచ్ జరిగే రోజు ఆ స్టేడియం వద్ద దొరుకుతాయి.
ఇదిగో ఆయా జట్ల టిక్కెట్ల కోసం జట్లపై క్లిక్ చేయండి:
ముంబై ఇండియన్స్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
చెన్నై సూపర్ కింగ్స్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
సన్రైజర్స్ హైదరాబాద్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
ఢిల్లీ డేర్డెవిల్స్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
కోల్కత్తా నైట్రైడర్స్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
ప్రారంభోత్సవ వేడుక తొలి మ్యాచ్ జరిగే స్టేడియంలోనే జరగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ సంరంభానికి సినీ తారలు హృతిక్ రోషన్, ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పరిణీతి చోప్రా హాజరుకానున్నారు. వేడుక దాదాపు 90నిమిషాల పాటు జరగనుంది. సరిగ్గా మ్యాచ్ జరగడానికి 15నిమిషాల ముందే కార్యక్రమం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ఐపీఎల్ ప్రచారంలో సినీ తారలను బాగానే వినియోగిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరీ జూ.ఎన్టీఆర్ను తెలుగు బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు.