
హైదరాబాద్ విజయాల్లో రషీద్ ఖాన్ కీలకపాత్ర
ఈ విజయాల వెనుక ఉన్న కీలక ఆటగాళ్లలో రషీద్ ఖాన్ కూడా ఒకడు. టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లను తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 55 పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్(32)ను బౌల్డ్ చేసి జట్టుకు చక్కటి శుభారంభాన్నిచ్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 132/6
ఆ తర్వాత కరుణ్ నాయ్యర్(13), రవిచంద్రన్ అశ్విన్(4)లను పెవిలియన్కు చేర్చాడు. నిజానికి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ముందు ఈ లక్ష్యం చాలా చిన్నదని అంతా భావించారు.

కేఎల్ రాహుల్ వికెట్ దక్కడం సంతోషం
అయితే అనూహ్యాంగా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దెబ్బకు పంజాబ్ 119 పరుగులకే కుప్పకూలింది. దీనిపై మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లమాడుతూ 'కేఎల్ రాహుల్ వికెట్ నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. అతనో క్లాస్ ఆటగాడు. నా అభిమాన ఆటగాళ్లలో రాహుల్ కూడా ఒకడు' అని తెలిపాడు.

మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు
'జట్టు తక్కువ స్కోర్ చేసినప్పుడు లెంగ్త్ సరిగా చూసుకుని వికెట్ టు వికెట్ బంతులేయాలన్నది నా ప్రణాళిక. అలా చేస్తేనే మా జట్టు తక్కువ స్కోర్ చేసిన ప్రత్యర్థి జట్టు దాన్ని ఛేదించకుండా చేయగలం. గత రెండు మ్యాచ్ల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ కూడా బాగుంది. కానీ, బ్యాట్స్మెన్ మరిన్ని పరుగులు చేయాలి' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
