
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన ట్రిక్స్తోనే తాను సత్తా చాటుతున్నానని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇషాన్ కిషన్ 2016-17 రంజీ సీజన్లో ధోనీతో పాటు జార్ఖండ్కు ఆడాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఆ సమయంలో ధోని నుంచి బ్యాటింగ్కు సంబంధించిన కొన్ని మెళకువలు నేర్చుకున్నట్లు ఇషాన్ కిషన్ వివరించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ 'నేను బ్యాటింగ్లో ఇంత బాగా రాణిస్తున్నానంటే ఇందుకు ప్రధాన కారణం మహేంద్ర సింగ్ ధోనినే' అని చెప్పుకొచ్చాడు.
'2016-17 రంజీ సీజన్లో ధోనీ ఉన్న జార్ఖండ్ జట్టులోనే నేను ఆడాను. ఆ సమయంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న నా వద్దకు ధోనీ వచ్చి కొన్ని సలహాలు ఇచ్చాడు. బౌలర్లను ఎలా ఎదుర్కోవాలి, సుదీర్ఘ ఇన్నింగ్ ఎలా ఆడాలో చెప్పాడు. నా బ్యాటింగ్ పొజిషన్ను మార్చుకోమని చెప్పాడు' అని వివరించాడు.
'నన్ను ఎంతగానో గమనించిన ధోనీ ఈ విషయం నాకు చెప్పాడని అందుకే ధోని చెప్పినట్లే చేశా. ఇది నాకు ఎంతో సాయపడింది. అప్పటి నుంచి అలాగే ఆడుతున్నాను. సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడటం అలవాటు చేసుకున్నా. యువ ఆటగాళ్లకు ఫిట్గా ఉండాలని ధోని సూచించేవాడు. ధోనితో ఆడిన ఆ సీజన్ను ఎప్పటికీ మరిచిపోలేను' అని ఇషాన్ తెలిపాడు.
2016-17 రంజీ సీజన్లో ఇషాన్ కిషన్ 57.07 యావరేజితో 10 మ్యాచ్లాడిన ఇషాన్ కిషన్ 799 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరుపున 5 మ్యాచ్ల్లో 30.20 యావరేజితో ఇషాన్ కిషన్ 151 పరుగులు చేశాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.