హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సురేశ్ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రేసియా పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు.
ఈ పుట్టినరోజు కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్ తదితరులు హాజరై సందడి చేశారు. వీరితో పాటు రైనా బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో చెన్నై ఆటగాళ్లు పాల్గొన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బ్రావో అయితే పాటలు పాడుతూ, డ్యాన్స్లు చేస్తూ సందడి చేశాడు. హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి ఈ వేడుకలకు హాజరైంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుతో తలపడనుంది.
Cutest visuals for 'Champion' you'll ever see! #whistlepodu @DJBravo47 #Gracia #Ziva 🦁💛 pic.twitter.com/kBIG5DIEue
— Chennai Super Kings (@ChennaiIPL) May 16, 2018
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కు చేరుకున్న తొలి జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ నిలవగా.... ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా చెన్నై ఇక రెండు మ్యాచ్లు ఆడనుంది.
Here is your midnight dose of cuteness to begin a super happy Wednesday! #WhistlePodu #GraciaTurns2 @ImRaina @_PriyankaCRaina @msdhoni @DJBravo47 @Geeta_Basra 🦁💛 pic.twitter.com/UbIRi7m0F6
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2018