హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందోనని అభిమానులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. చివర్లో రాజస్థాన్ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్ అద్భుత ఇన్నింగ్స్తో రాజస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే అద్భుమైన ఫీల్డింగ్ చేశాడు. ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను మొదటి బంతికే పెవిలియన్కు చేర్చాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ మొదటి బంతిని ఆన్ సైడ్ మీదుగా డిఫెన్స్ ఆడి పరుగు తీసేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రహానే ఎవరూ ఊహించని విధంగా బంతిని అందుకొని వికెట్లకి గిరాటేశాడు. దీంతో రోహిత్ శర్మ ఆడిన మొదటి బంతికే పెవిలియన్కు చేరాడు. అయితే రహానే రనౌట్ చేసిన తీరు చూస్తే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ని గుర్తుతెచ్చాడు.
1992 వరల్డ్ కప్ సమయంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో జాంటీ రోడ్స్ పాక్ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ను రనౌట్ చేసిన విధంగానే రహానే కూడా రోహిత్ శర్మను రనౌట్ చేశాడని సోషల్ మీడియాలో రహానేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్ ఔటైన సమయంలో అతడి భార్య రితికా త్యేక ఆకర్షణగా నిలిచింది.
రోహిత్ శర్మ ఎదుర్కొన్న మొదటి బంతికే ఔట్ కావడంతో రితికా కాస్తంత అసహనానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ... ఐపీఎల్ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ వీడియో మీ కోసం.....