|
21 బంతుల్లో 62 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
21 బంతుల్లో 62 పరుగులు చేసి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ 'యువ ఆటగాడిపై జట్టు కెప్టెన్, యాజమాన్యం నమ్మకం ఉంచి ముందు వరుసలో బ్యాటింగ్ పంపించడం పట్ల ఆనందంగా ఉంది' అని తెలిపాడు.
|
ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడటానికి ఇద్దరు కారణం
'ఈ మ్యాచ్లో నేను ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడటానికి ఇద్దరు కారణం. ఒకరు రోహిత్ శర్మ కాగా మరొకరు మహేంద్ర సింగ్ ధోనీ. టోర్నీలో భాగంగా ముంబw-చెన్నై మధ్య రెండో మ్యాచ్ అనంతరం నేను కొద్ది సమయం ధోనీతో మాట్లాడాను. అతనిచ్చిన సలహాలు, సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి' అని పేర్కొన్నాడు.
ధోనీని ఎప్పుడు కలిసినా చాలా నేర్చుకుంటా
'ధోనీని నేను ఎప్పుడు కలిసినా చాలా నేర్చుకుంటాను. అతనో దిగ్గజ క్రికెటర్. మ్యాచ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మన ఆట తీరు మారాలని సూచించాడు. ధోనీ నాతో మాట్లాడిన తీరు నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. అలాగే రోహిత్ శర్మ కూడా నాకు ఎప్పుడు మద్దతిస్తూనే ఉంటాడు' అని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.
నీపై నువ్వు నమ్మకం ఉంచుకో
ఈ ఇద్దరు కూడా ‘ఏదో ఒక రోజు గొప్ప ఇన్నింగ్స్ ఆడతావు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకో' అని చెబుతుండేవారని ఇషాన్ అన్నాడు. తాజా విజయంతో ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్కతా సంక్షిష్టం చేసుకుంది.
కోల్కతాపై 18 సార్లు గెలిచిన ముంబై
ఐపీఎల్లో కోల్కతాతో 23 మ్యాచ్లాడిన ముంబై 18 సార్లు గెలవడం విశేషం. చివరి 8 మ్యాచుల్లోనూ కోల్కతాపై ముంబై విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం వాంఖడెలో జరగనుంది.