ముంబై: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సతీమణి, బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాన్కోవిచ్కు ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్కు విరుద్దంగా ఉందని తొలగించింది. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన నటాషా.. ఇన్స్టాపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇన్స్టా రిమూవ్ చేసిన స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ..'అవునా ఇన్స్టాగ్రామ్.. నా పోస్ట్ కమ్యూనిటి గైడ్ లైన్స్కు విరుద్దంగా ఉందా..?'అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇంతకీ నటాషా చేసిన పోస్ట్ ఏంటంటే.. ఐపీఎల్ కోసం తమను విడిచి వెళ్లిన హార్దిక్ పాండ్యాను తలుచుకుంటూ అతని ఫొటోను షేర్ చేసింది. ఈ విషయంలో అభిమానులు కూడా నటాషాకు మద్దతు తెలుపుతున్నారు. ఇక కరోనాతో కలిసొచ్చిన టైమ్ను తెగ ఆస్వాదించిన ఈ జోడీ.. ఇటీవలే ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. బుల్లి హార్దిక్ పాండ్యాకు 'అగస్త్య' అని పేరు కూడాపెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరుపుకున్న జోడీ.. అంతలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి అందర్ని షాక్కు గురిచేసింది. అయితే వీరి పెళ్లిపై మాత్రం క్లారిటీ లేదు.
కానీ దండలు మార్చుకున్న ఓ ఫొటో మాత్రం వైరల్ అయింది. దాన్ని బట్టి మేలో పెళ్లైనట్లు వార్తలు వెలువడ్డాయి. చాలా రోజుల నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2020 ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఆగస్టు 20 తర్వాత ఆటగాళ్లు యూఏఈకి వెళ్లనున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్లో అగ్రశ్రేణి ఆల్రౌండర్గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే భార్య, బిడ్డను వదిలి ముంబై క్యాంప్లో చేరాడు.