
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మెయింటేన్ చేస్తారన్న విషయం తెలిసిందే. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇతరుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా వీరు సెలబ్రిటీలను రక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కూడా బాడీ గార్డ్ను మెయింటేన్ చేస్తున్నారు. మొదట అనుష్క శర్మ పర్సనల్ బాడీగార్డ్గా ఉన్న అతను పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీకి కూడా సేవలందిస్తున్నాడు. అతని పేరు ప్రకాశ్ సింగ్ అకా సోను. ముద్దుగా సోను అని పిలుస్తుంటారు.
అయితే ఓ వెబ్సైట్ కథనం ప్రకారం సోను సేవలకు విరుష్క జోడీ భారీ మొత్తంలో వేతనం చెల్లిస్తుందంట. అతనికి చెల్లించే జీతం ముందు ప్రముఖ కంపెనీల సీఈవో కూడా పనికిరారట. సోను సేవలకు అనుష్క-కోహ్లీ జోడీ సంవత్సరానికి అక్షరాల రూ.1.2 కోట్లు సాలరీ ఇస్తున్నారంట. అంటే నెలకు 8 లక్షల 50 వేలు అన్నమాట. ఇదే నిజమైతే భారత్లో చాలా మంది కంపెనీల సీఈవోలకు ఇచ్చే జీతం కన్నా ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాడీ గార్డ్కు అంత జీతమా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు సంపాదించే వారకి ఇదో లెక్కనా? అని మరికొంతమంది అంటున్నారు. బాడీ గార్డ్ ఉద్యోగం చేసినా బాగుండని మరికొంతమంది నిట్టూరుస్తున్నారు.
ఇక సోనూను విరుష్క జోడీ బాడీ గార్డ్ కంటే తమ కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేస్తోంది. ఎన్నోసార్లు అతని బర్త్డే వేడుకులను కూడా ఈ జోడీ సెలబ్రేట్ చేసింది. షారుఖ్ ఖాన్తో కలిసి నటించి జీరో సినిమా షూటింగ్ సందర్భంగా కూడా అనుష్క.. సోనూ బర్త్డే వేడుకలు జరిపింది. ఇక అనుష్క ప్రెగ్నెన్సీ టైమ్లో కూడా సోనూ కుటుంబ సభ్యుడిగా ఆమెకు సేవలందించాడు. కరోనా టైమ్లో పీపీఈ కిట్స్ ధరించి ఆమెకు రక్షణగా నిలిచాడు. ఇప్పుడు అతని బాధ్యత రెట్టింపు అయ్యింది. విరుష్కల గారాల పట్టీ వామికాను కంటికి రెప్పాల కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇప్పటి వరకు ఆమె ఫొటోను రిలీజ్ చేయని నేపథ్యంలో కెమెరాల నుంచి కూడా రక్షించాల్సిన బాధ్యత సోనూపై ఉంది.