For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: కోహ్లీ, రోహిత్ లేడు.. భారత్ X వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను దేకెటోడే లేడు!

India vs West Indies Registers Lowest TRP Rating Since There Is No Virat Kohli And Rohit Sharma

న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ పర్యటనకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీలు దూరంగా ఉన్నా.. శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో థ్రిల్లింగ్ విజయాలను నమోదు చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టే గెలుపొందింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

వ్యూయర్‌షిప్ ఢమాల్..

వ్యూయర్‌షిప్ ఢమాల్..

టీ20 తరహాలో సస్సెన్స్ థ్రిల్లర్‌లను తలపించిన ఈ రెండు మ్యాచ్‌లకు పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఈ సిరీస్‌ను జనాలు లైట్ తీసుకున్నారు. దాంతోనే గత సిరీస్‌లు మాదిరిగా.. ఈ పర్యటనలో భారత్ గెలిచినా పెద్దగా చర్చ జరగడం లేదు. అసలు చాలా మందికి ఈ సిరీస్ జరుగుతుందనే విషయమే తెలియదు. ఈ సిరీస్‌కు ప్రేక్షక ఆదరణ లభించకపోవడానికి సీనియర్ ప్లేయర్లు లేకపోవడం ప్రధాన కారణమైతే మరో కారణం వెస్టిండీస్ టైమింగ్స్.

టైమింగ్స్ అనుకూలంగా లేకపోవడం..

టైమింగ్స్ అనుకూలంగా లేకపోవడం..

రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్ మళ్లీ వేకువజామున 3 గంటలకు ముగుస్తోంది. ఈ టైమింగ్స్‌తో భారత అభిమానులు మ్యాచ్‌లు చూడలేకపోతున్నారు. పడుకునేసరికి మ్యాచ్ ముగియకపోవడం.. లేచేసరికి రిజల్ట్ వస్తుండటంతో ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌ల మజాను అభిమానులు ఎంజాయ్ చేయలేకపోయారు. ఓటీటీ హక్కులు కూడా ఫ్యాన్ కోడ్ దగ్గర ఉండటం.. దాని సబ్‌స్క్రిప్షన్ ఎవరి దగ్గర ఎక్కువ లేకపోవడం కూడా వ్యూయర్ షిప్ రాకపోవడానికి కారణమైంది. డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రసారం జరుగుతుండగా ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం కూడా వ్యూయర్‌షిప్‌పై ప్రభావం చూపింది.

టీ20 సిరీస్‌తో..

టీ20 సిరీస్‌తో..

స్టార్ స్పోర్ట్స్, సోనీ చానెల్స్ తమ మ్యాచ్‌ల వివరాలను ఎక్కువగా క్యాంపైన్ చేస్తుంటాయి. ఆయా చానెల్స్‌కు రీజినల్ కామెంట్రీ కూడా అందుబాటులో ఉండటం, డీడీ స్పోర్ట్స్ కేవలం హిందీ వ్యాఖ్యానం రావడం కూడా వ్యూయర్ ‌షిప్‌పై ప్రభావం చూపింది. అయితే టీ20 సిరీస్ వరకు ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి రావడం మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవడం వంటి అంశాలతో వ్యూయర్‌షిప్ పెరిగే అవకాశం ఉంది.

Story first published: Monday, July 25, 2022, 15:44 [IST]
Other articles published on Jul 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+