
మళ్లీ నిరాశే:
147 పరుగుల లక్ష్య చేధనలో.. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ (3) మళ్లీ నిరాశ పరిచాడు. విండీస్ పేసర్ థామస్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతికి షాట్ ఆడే క్రమంలో కాట్రెల్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (20; 18బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో అలెన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు.

భారీ భాగస్వామ్యం:
అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 16వ ఓవర్లో కోహ్లీ.. 17వ ఓవర్లో పంత్ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే థామస్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.

పంత్ షో:
కోహ్లీ నిష్క్రమణ అనంతరం థామస్ బౌలింగ్లోనే పంత్ సిక్స్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేసాడు. కాట్రెల్ వేసిన 19వ ఓవర్లో మనీష్ పాండే (2) తడబడంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఇక బ్రాత్వైట్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికే పంత్ సిక్సర్ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమయిన పంత్.. ఈ మ్యాచులో ఆకట్టుకున్నాడు.
భారత్తో జరిగిన ఆ మ్యాచే నా కెరీర్లో ఓ చేదు జ్ఞాపకం

చహర్ సూపర్ స్పెల్:
అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టును కీరన్ పొలార్డ్ (58; 45 బంతుల్లో 1×4, 6×6) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. చివర్లో పావెల్ (32 నాటౌట్; 20 బంతుల్లో 1×4, 2×6) మెరుపులతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. మూడు వికెట్లు తీసిన భారత బౌలర్ దీపక్ చాహర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది. గురువారం ఇదే మైదానంలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications












