సవాల్ ఎదురుకానుంది:
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ... 'పంత్ మంచి ఆటగాడు. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అందులో సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో పంత్ ఆట ఏమంత బాగాలేదు. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. పంత్ ఇలానే ఆడితే.. అతని స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్తో నీకు సవాల్ ఎదురుకానుంది. నా ఫేవరెట్ ఆటగాడు శాంసన్ నీకు సీరియస్ చాలెంజ్లు విసురుతున్నాడు' అని వార్నింగ్ ఇచ్చాడు.
తన ప్రదర్శనపై పరిశీలన చేసుకోవాలి:
'పంత్కు చాలా అవకాశాలు లభించాయి. అతను ఒక్కసారి వెనక్కి చూసుకుని తన ప్రదర్శనపై పరిశీలన చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా మంచి ప్రదర్శన చేయాల్సిన సమయం వచ్చింది' అని గంభీర్ సూచించాడు. 'మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్లు తమ స్థానాలను నిలబెట్టుకోవడానికి మరొక అవకాశం లభించింది. అందరూ నిరూపించుకోవాలి. యువ బౌలర్లకు కూడా దక్షిణాఫ్రికా సిరీస్ వరం లాంటిది' అని గంభీర్ పేర్కొన్నాడు.
జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది:
'దక్షిణాఫ్రికాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో టీమిండియానే ఫేవరెట్. ప్రస్తుత సఫారీ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్ల లోటు కనబడుతోంది. ప్రధానంగా డుప్లెసిస్, ఆమ్లా, డేల్ స్టెయిన్లు సఫారీ జట్టుకు అందుబాటు లేకపోవడంతో.. జట్టు బలహీన పడింది. వారి లోటు జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది' అని గంభీర్ చెప్పుకొచ్చారు.
మాజీ కెప్టెన్కు హెచ్ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!
శాస్త్రి హెచ్చరికలు:
పంత్ నిర్లక్ష్య ఆటతీరుపై కోచ్ రవిశాస్త్రి కూడా హెచ్చరికలు జారీ చేశాడు. 'మా ప్రోత్సాహం పంత్కు ఉంటుంది. అయితే ట్రినిడాడ్ మ్యాచ్లో తొలి బంతికే అతడు అవుటైన తీరు నిరాశపరిచింది. ఇది మళ్లీ రిపీట్ అయితే మాత్రం వేటు తప్పదు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ కొనసాగిస్తే.. జట్టు విజయాలకు కారణమవుతాడు' అని రవిశాస్త్రి అన్నాడు.