5000 టికెట్లు వారికే
సీఆర్పీఎఫ్ జవాన్లు, సైనికులు, ఎన్సీసీ క్యాడెట్ల కోసం ఉచితంగా 5000 టికెట్లను పక్కనబెట్టింది. యూనిఫాం ధరించి దేశానికి సేవ చేస్తున్నవారికి ఉచితంగా టికెట్లు ఇవ్వాలని జేఎస్సీఏ నిర్ణయం తీసుకుంది. అయితే, స్టేడియానికి వచ్చే అభిమానుల సంఖ్య 20వేలకు మించకపోవచ్చని జేఎస్సీఏ భావిస్తోంది.
మ్యాచ్ని నిర్వహించడం వల్ల
అయితే, ఈ మ్యాచ్ని నిర్వహించడం వల్ల స్టేడియంలో పిచ్, లైట్స్, అగ్నిమాపక వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చని జేఎస్సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ అన్నారు. నిజానికి టెస్టుల్లో రోజువారి టికెట్లు రూ. 200-2000 మధ్యలో ఉంటాయి. టెస్టు డిమాండ్ ఉంటే టికెట్ ధర రూ.2వేలు ఉంటుంది.
క్లీన్ స్వీప్: చరిత్ర సృష్టించేందుకు ఒక టెస్టు దూరంలో టీమిండియా!
ఇప్పటికే 2-0తో సిరిస్ కైవసం
కానీ, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో టీమిండియా ఇప్పటికే 2-0తో సిరిస్ను కైవసం చేసుకోవడంతో మూడో టెస్టు నామమాత్రంగానే ఉంది. దీంతో మూడో టెస్టుకు ప్రేక్షకుల హాజరు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, మూడో టెస్టుకు ధోనీ వస్తే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుందని సంజయ్ సహాయ్ తెలిపారు.
ఆటగాళ్లకు వేర్వేరు హోటళ్లలో గదులు
దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు వేర్వేరు హోటళ్లలో గదులు కేటాయించడంలో తమ పాత్రేమీ లేదని జేఎస్సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ తెలిపాడు. రాంచీ స్టేడియానికి 13 కిలోమీటర్ల దూరంలో సఫారీలకు, 9 కిలోమీటర్ల దూరంలో టీమిండియాకు బస ఏర్పాటు చేశారు. సాధారణంగా రెండు జట్లు ఒకే హోటల్లో బస చేస్తాయి.
భిన్నంగా విడిది ఏర్పాటు
అయితే, ఈసారి అందుకు భిన్నంగా విడిది ఏర్పాటు చేశారు. ఈసారి డాక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుండటంతో వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సంజయ్ సహాయ్ తెలిపాడు. "గదులను ఏడాది ముందుగానే బుక్ చేస్తారు. ఏదేమైనప్పటికీ గదులు బుక్ చేసింది మేం కాదు. బీసీసీఐ" అని సంజయ్ చెప్పుకొచ్చాడు.