
2021 సెకండాఫ్లో..
అయితే ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో ఓ సిరీస్లో తలపడబోతున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2021 సెకండాఫ్లో రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగే అవకాశాలున్నట్లు పాకిస్థాన్కు చెందిన స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాదిలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లు సదరు చానెల్ తమ కథనంలో తెలిపింది.

వన్డే ప్రపంచకప్లో చివరిసారిగా..
ఓ పీసీబీ అధికారి దాన్ని స్పష్టం చేశాడని పేర్కొంది. మరోవైపు తమ దేశంలో 2023లో నిర్వహించే ఆసియా కప్లో భారత్ ఆడుతుందనే ఆశాభావాన్ని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లగా. ఈ ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్లో ఆఖరిసారిగా తలపడ్డాయి.

భారత్దే పై చేయి..
పాకిస్థాన్పై ఏ ఫార్మాట్లోనైనా భారత్కే మెరుగైన రికార్డ్ ఉంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్ల పరంగ మాత్రం పాక్దే పైచేయి. ఇప్పటి వకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా.. భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా.. పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.


Click it and Unblock the Notifications
