
పాయింట్ల ఆధారంగా..
ఈ మెగా టెస్ట్ టోర్నీలో భాగంగా జరిగే ఒక్కో ద్వైపాక్షిక సిరీస్కు 120 పాయింట్లు కేటాయించారు. ఒక సిరీస్లో ఐదు టెస్టులు ఆడితే ప్రతీ మ్యాచ్కు 24 పాయింట్లను గెలిచిన టీమ్కు కేటాయించారు. రెండు టెస్టుల సిరీస్లో ఒక్కో మ్యాచ్కు 60 పాయింట్లు ఇచ్చారు. ఈ పాయింట్ల పద్దతిపై అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది.
మ్యాచ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లాభం ఏంటనే ప్రశ్న తలెత్తింది. అయితే సజావుగా సాగుతున్న ఈ డబ్ల్యూటీసీ టోర్నీపై కరోనా దెబ్బ పడింది. ఈ మహమ్మారి కారణంగా క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారడం, దాదాపు అయిదారు నెలలు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగలేదు. దాంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రూల్స్లో మార్పులు తీసుకొచ్చింది.

విజయాల శాతం..
కరోనా కారణంగా మొత్తం ఆరు టెస్ట్ సిరీస్లను రద్దు చేయాల్సి వచ్చింది. రద్దు చేసిన సిరీస్లను డ్రాగా పరిగణించిన ఐసీసీ.. విజయాల శాతాన్ని ప్రవేశపెట్టింది. ఆడిన మ్యాచ్లు.. గెలిచినవి లెక్కగట్టి ర్యాంకులు కెటాయించింది. దాంతో ఈ టోర్నీలో భాగంగా 6 సిరీస్ల్లో 16 మ్యాచ్లు ఆడిన భారత్ 12 విజయాలు, 4 ఓటములతో 520 పాయింట్లు సాధించి మెరుగైన విన్నింగ్ పర్సెంటేజ్తో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు 5 సిరీస్లు ఆడిన న్యూజిలాండ్ 7 విజయాలు, 4 ఓటములతో 420 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి భారత్తో ఫైనల్కు రెడీ అయింది.

డ్రా అయితే..
అన్ని ఆటంకాలను దాటుకొని ముగింపు చేరుకున్న ఈ మెగా టోర్నీలో మరో సందేహం అభిమానులను వెంటాడుతుంది. మాములుగా టెస్ట్ మ్యాచ్లంటేనే ఫలితం తేలవు. విజయాల కన్నా డ్రాలే ఎక్కువ అవుతుంటాయి. మరీ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కూడా డ్రా అయితే పరిస్థితి ఏందనే ప్రశ్న ప్రతీ క్రికెట్ అభిమాని మదిలో మెదులుతుంది.
అయితే ఐసీసీ మాత్రం డ్రాకు సంబంధించిన ఫార్మూలను పేర్కొనలేదు. దీన్ని బట్టి మ్యాచ్ టై అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నారు. కాకపోతే ఈ మెగా మ్యాచ్కు మాత్రం రిజర్వ్ డే కేటాయించారు. ఈ ఐదు రోజుల ఆటలో వాతావారణం అనుకూలించకనో లేక బ్యాడ్ లైట్ కారణంగానే పూర్తి కోటా ఓవర్లు పూర్తి కాకుండా మ్యాచ్ ఎండ్ అయితే.. రిజర్వ్ డేలో ఆ ఓవర్లన్నీ ఆడవచ్చు. మళ్లీ ఫలితం తేలేవరకు ఆడటానికి వీలు లేదు. ఆటంకం కలిగిన ఓవర్లను మాత్రం ఆడిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications












