
కివీస్ ఓపెనర్లు ఓపికగా..
స్వింగ్ పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), బండెల్(55)ఓపికగా ఆడారు. స్వల్ప లక్ష్యమే అయినా బ్యాటింగ్కు ఏమాత్రం అనువుగా లేని పిచ్పై తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించిన ఈ జోడీ.. నిదానంగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవిస్తూ అవకాశం వచ్చిన బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో కొంత జోరు పెంచిన లాథమ్ 67 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే జోరులో ఉమేశ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విలియమ్సన్ రాగా.. న్యూజిలాండ్ 108/1తో టీ బ్రేక్కు వెళ్లింది.

విలియమ్సన్ విఫలం..
విరామం అనంతరం బ్లండెల్ 108 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాయి. అయితే బుమ్రా తన వరుస ఓవర్లలో విలియమ్సన్(5), బండ్లెల్(55) ఔట్ చేసి పెవిలియన్ చేర్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత టేలర్(5 నాటౌట్), నికోలస్ (5 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి విజయాన్నందించారు.

34 పరుగుల్లోనే..
90/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 34 పరుగులు మాత్రమే జోడించి కుప్పకూలింది. క్రీజులో ఉన్న పంత్, విహారీలు అద్భుతం చేయలేకపోయారు. టాపార్డ్ తరహాలోనే దారుణంగా విఫలమయ్యారు. లోయరార్డర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. జడేజా కొంత ప్రయత్నం చేసినా.. అతనికి ఇతర ఆటగాళ్ల నుంచి సహకరం అందలేదు. దీంతో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.


Click it and Unblock the Notifications
