
కాలుష్యం ముప్పు..
ఈ మ్యాచ్కు మంచుతో పాటు గాలి కాలుష్యం ముప్పు కూడా కనిపిస్తోంది. ఢిల్లీ మాదిరిగా జైపూర్లో కూడా గాలి కాలుష్యం లెవల్స్ పెరిగాయి. సిటీలో ఆదివారం ఉదయం విపరీతమైన పొగ కమ్ముకుంది. గత వారం రోజులుగా పింక్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 పాయింట్లుగా నమోదవుతున్నది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే తామున్నది క్రికెట్ ఆడటానికే అని భారత వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ అంటున్నాడు. పొల్యూషన్ అంత తీవ్రంగా ఏమీ లేక పోవచ్చని అభిప్రాయపడ్డాడు.

25 వేల మంది ఫ్యాన్స్..
ప్రస్తుతం జైపూర్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో ఈ మ్యాచ్కు ప్రేక్షకుల సంఖ్య భారీగానే ఉండనుంది. దాదాపు 25 వేల మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ల సేల్ మొదలైన మూడు గంటల్లోనే 8 వేలు అమ్ముడుపోయాయని ఆర్సీఏ సెక్రటరీ మహేంద్ర వర్మ వెల్లడించాడు. మరోవైపు కొవిడ్ కారణంగా మే నెలలో ఐపీఎల్ను అర్దాంతరంగా ముగించి తీసుకెళ్లిన బీసీసీఐ.. ఈ సిరీస్ను సక్సెస్ఫుల్గా నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పట్నించే ప్రణాళికలు వేస్తోంది.

భారత్ ప్రాక్టీస్ షురూ..
ఈ సిరీస్ కోసం ఇప్పటికే జైపూర్ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. కొత్త హెడ్ కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. టీ20 నయా సారథి రోహిత్ శర్మ నెట్స్లో భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. మిగతా ప్లేయర్లు కూడా వామప్స్తో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు.
నెట్ సెషన్లో చెమటోడ్చారు. మరోవైపు ఆదివారం రాత్రి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ టీమ్ దుబాయ్ నుంచి చార్టర్ ఫ్లైట్లో సోమవారం సాయంత్రం జైపూర్లో ల్యాండ్ అయ్యింది. వరల్డ్ కప్ బబుల్ నుంచి నేరుగా వచ్చిన నేపథ్యంలో తొలి మ్యాచ్కు ముందు కివీస్ ప్లేయర్లకు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదు. కివీస్ మంగళవారం ప్రాక్టీస్ స్టార్ట్ చేయనుంది.


Click it and Unblock the Notifications












