
ఇంతకీ విషయం ఏంటంటే..?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ వేదిసన 12వ ఓవర్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జానీ బెయిర్ స్టో లెగ్ సైడ్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శార్ధూల్ ఆలస్యంగా స్పందించాడు. అంతేగాకుండా బంతిని సరిగ్గా అందివ్వడంలో విఫలమయ్యాడు. దాంతో మిస్ ఫీల్డ్ జరిగి ఇంగ్లండ్కు మరో పరుగు అదనంగా వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన కోహ్లీ.. శార్థూల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో యువ పేసర్పై నోరు పారేసుకున్నాడు. అప్పటికే బెదురుగా చూసిన శార్దూల్, తన తప్పేమీ లేదన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.

కోహ్లీని తప్పుబడుతున్న నెటిజన్లు..
ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు(కోహ్లి, చహల్)క్యాచ్లు వదిలేసినా పర్లేదు కానీ, శార్దూల్ సరిగా త్రో చేయనందుకు ఇంతలా కోప్పడ్డతారా''అని విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 76 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ, 20 పరుగుల వద్ద బెయిర్స్టో ఇచ్చిన క్యాచ్ను చహల్ వదిలేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే మ్యాచ్ దాదాపుగా భారత్ చేజారడంతో వాటిని అందుకున్నాపెద్దగా ఫలితం ఉండకపోయేది.

చిత్తయిన భారత్..
ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ ఇదే వేదికగా గురువారం జరుగుతుంది.


Click it and Unblock the Notifications
