
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జాక్ లీచ్ వేసిన 79వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన సుంధర్ 82 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో కెరీర్లో రెండో అర్థశతకాన్ని అందుకున్నాడు. కెరీర్లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న సుందర్.. సొంతగడ్డపై తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇక 257/6 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన భారత్.. సుందర్, అశ్విన్(24) సూపర్ బ్యాటింగ్తో 300 మార్క్ ధాటింది. డామ్ బెస్ బౌలింగ్లో మిడాన్ మీదుగా అశ్విన్ అద్భుత సిక్సర్ కొట్టాడు. ఈ సూపర్ సిక్స్కు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ మొత్తం అభినందించింది. ఇలానే ఈ జోడీ ఓవర్కో బౌండరీ రాబట్టడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తుతుంది. ప్రస్తుతం కొత్త బంతిని అందుకున్న ఇంగ్లండ్ పేసర్లు భారత బ్యాటింగ్ ధ్వయాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
ఆ వెంటనే లీచ్కు బంతిని అందించిన జోరూట్ ఫలితాన్ని రాబట్టాడు. అతని బౌలింగ్లో అశ్విన్(31) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో 6 వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ 87 ఓవర్లలో 7 వికెట్లకు 305 పరుగులు చేసింది. సుందర్(58 బ్యాటింగ్)తో పాటు క్రీజులో షాబాజ్ నదీమ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. కోహ్లీ సేన ఇంకా 273 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 578 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.