ధోనీ రికార్డు బద్దలు..
స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును తాజా విజయంతో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సొంతగడ్డపై కెప్టెన్గా 29 టెస్టులు ఆడిన విరాట్ 22 విజయాలు కైవసం చేసుకున్నాడు. దాంతో, 30 టెస్ట్ల్లో 21 విజయాలు సాధించిన ధోనీని అధిగమించాడు. ఓవరాల్గా 35 టెస్ట్ విజయాలతో విరాట్ కోహ్లీ ఇప్పటికే భారత్ తరఫున అత్యంత విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు.
అశ్విన్ 400
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన అతడు 77 టెస్టుల్లోనే 401 వికెట్లు తీయడం విశేషం. దాంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్, మూడో స్పిన్నర్గా అవతరించాడు. అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434), హర్భజన్ (417) అతనికంటే ముందున్నారు. ఓవరాల్గా 400 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్గా.. 16వ బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అంతేకాకుండా ముత్తయ్య మురళీధరన్ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్గా గుర్తింపు పొందాడు.
అక్షర్ అత్యుత్తమం
గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అతడి స్థానాన్ని అంచనాలను మించి భర్తీచేశాడు. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్ల రికార్డు సాధించిన అతను మొతేరాలో 10+ వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. డే/నైట్ టెస్టులో 11/70తో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2018/19లో శ్రీలంకపై ప్యాట్ కమిన్స్ 10/62, 2016/17లో పాక్పై దేవేంద్ర బిషూ 10/174 ఈ ఘనత సాధించారు. అయితే అక్షర్వే మెరుగైన గణాంకాలు.
వరుసగా మూడు అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న భారత నాలుగో బౌలర్గా అక్షర్ నిలిచాడు. గతంలో హర్భజన్, శివరామకృష్ణన్, శ్రీనాథ్ ఈ ఘనత సాధించారు.
మరిన్ని రికార్డులు..
1. డే/నైట్ టెస్టులో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీసింది అహ్మదాబాద్ టెస్టులోనే. ఇంగ్లండ్, భారత్ స్పిన్నర్లు మొత్తంగా 27 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు దుబాయ్లో పాక్ vs శ్రీలంక మ్యాచులో 24, పాక్ vs వెస్టిండీస్ టెస్టులో 22, ఆసీస్vs న్యూజిలాండ్ పోరులో 8 వికెట్లు తీశారు.
2. టీమిండియాపై ఇంగ్లండ్ చేసిన అత్యల్ప స్కోరు 81. మొతేరా రెండో ఇన్నింగ్స్లో నమోదైంది. 1971లో ఓవల్లో 101, 1979/80లో ముంబయిలో 102, 1986లో లీడ్స్లో 102, 2020/21లో అహ్మదాబాద్లో 112 మిగిలిన నాలుగు సందర్భాలు.
3. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్లు కేవలం నలుగురే. 1888లో ఆసీస్పై బాబ్ పీల్, 1907లో ఇంగ్లండ్పై బెర్ట్ వోగ్లర్, చెన్నై టెస్టులో ఇంగ్లండ్పై అశ్విన్ ఈ ఘనత సాధించారు. మొతేరా టెస్టులో అక్షర్ పటేల్ ఈ జాబితాలో సరికొత్తగా చేరాడు. రెండో ఇన్నింగ్స్లో తొలి బంతికే జాక్ క్రాలీని పెవిలియన్ పంపించాడు.
4. రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ గెలవడం భారత్కు ఇది రెండోసారి. 2018లో అప్గానిస్తాన్పై ఈ ఫీట్ సాధించింది. టెస్ట్ చరిత్రలో రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ పూర్తవ్వడం ఇది 22వ సారి.
5. ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ ఆడిన బంతుల సంఖ్య 842. అతి తక్కువ బంతుల్లో మగిసిన టెస్ట్ ఇదే.