
భారత్ 339 ఆలౌట్..
అంతకు ముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 329 పరుగులకు ఆలౌటైంది. 300/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు డాషింగ్ హిట్టర్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు. ఓవర్నైట్ బ్యాట్స్మన్ అక్సర్ పటేల్(5) మొయిన్ అలీ ఒక్క పరుగు కూడా చేయకుండా స్టంపౌటవ్వగా.. బంతి వ్యవధిలోనే ఇషాంత్ శర్మ(0) కూడా ఔటయ్యాడు. దాంతో ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన పంత్..ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ స్టోన్.. ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్(0), మహ్మద్ సిరాజ్(0)లను కీపర్ క్యాచ్లుగా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఇషాంత్ దెబ్బ..
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బర్న్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అశ్విన్.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16) క్యాచ్ఔట్ చేయగా.. అరంగేట్ర ఆటగాడు అక్షర్ పటేల్ ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(6)ను పెవిలియన్కు చేర్చాడు. స్వీప్ షాట్లు అలవోకగా ఆడే జోరూట్ను ఆ ఉచ్చులోనే బిగించాడు. 10 ఓవర్లో అతను వేసిన డ్రై లెంగ్త్ బాల్ను స్వీప్ షాట్ ఆడిన జోరూట్(6).. షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న అశ్విన్కు చిక్కాడు. ఆ తర్వాత డాన్ లారెన్స్(9)ను అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 39/4తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

రిషభ్ పంత్ సూపర్ క్యాచ్..
అనంతరం బెన్ స్టోక్స్(9)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఓలి పోప్(22)ను రిషభ్ పంత్ సూపర్ క్యాచ్ సాయంతో సిరాజ్ పెవిలియన్కు చేర్చాడు. స్వదేశంలో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న సిరాజ్.. తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. లెగ్ స్టంప్ దిశగా వేసిన బాల్ను ఓలీపోప్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన బంతిని రిషభ్ సూపర్ మ్యాన్లా ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు.
కొద్దిసేపటికే మొయిల్ అలీ(6) రహానే సూపర్ క్యాచ్లో అక్షర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ఓలి స్టోన్ను అశ్విన్ పెవిలియన్కు చేర్చడంతో ఇంగ్లండ్ 106/8తో టీ బ్రేక్కు వెళ్లింది.

అశ్విన్ పాంచ్ పటాకా..
బ్రేక్ అనంతరం 10 ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లండ్ ఆలౌటైంది. రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్తో జాక్ లీచ్(5)ను ఇషాంత్ పెవిలియన్ చేర్చగా.. స్టువర్ట్ బ్రాడ్(0)ను అశ్విన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్తో అశ్విన్ 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఓవరాల్గా తన కెరీర్లో 29 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. శుభ్మన్ గిల్(14) మరోసారి నిరాశపరిచాడు. జాక్ లీచ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది.


Click it and Unblock the Notifications
