For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో అతనికి చోటు ఖాయం: సునీల్ గవాస్కర్

India vs England: Sunil Gavaskar calls for Kuldeep Yadavs inclusion in playing XI for 2nd Test

చెన్నై: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్‌టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు అండగా రాణించడంలో నదీమ్‌, అశ్విన్ విఫలమయ్యారు. నదీమ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి తీసుకురాలేకపోయాడు. దీంతో అతని స్థానంలో కుల్దీప్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

కుల్దీప్ రావడం ఖాయం..

కుల్దీప్ రావడం ఖాయం..

'కాస్త వైవిధ్యంగా బంతులు విసిరే కుల్దీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఆఫ్‌ స్పిన్నర్లు. అశ్విన్ గాల్లో నెమ్మదిగా బంతులు వేస్తే, సుందర్ వేగంగా విసురుతాడు. కాబట్టి నదీమ్‌/సుందర్‌ స్థానాల్లో కుల్దీప్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 85 నాటౌట్ పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన సుందర్‌ను తప్పించలేరు. అయితే ఎవరు జట్టులోకి వచ్చినా ఇంగ్లండ్‌ను తక్కువస్కోరుకే కట్టడి చేయడానికి ప్రయత్నించాలి'' అని గవాస్కర్ సూచించాడు.

ఎక్స్‌ట్రాలపై దృష్టి సారించాలి..

ఎక్స్‌ట్రాలపై దృష్టి సారించాలి..

'తొలి టెస్టులో నదీమ్ కాస్త భయపడ్డాడు. అతని బౌలింగ్‌ను ఉద్దేశించి చెప్పట్లేదు. అతను వేసిన నో బాల్స్‌ గురించి మాట్లాడుతున్నా. స్పిన్‌లో ఆత్రుతతో బంతులు వేయాలనుకున్నప్పుడే క్రీజును దాటుతుంటారు. అశ్విన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నో ఏళ్ల తర్వాత అతను నోబాల్స్‌ వేశాడు. టీమిండియా వీటిపై దృష్టిసారించాలి'' అని గావస్కర్‌ పేర్కొన్నాడు. భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో 20, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు నోబాల్స్‌ వేశారు. వీటిలో నదీమ్‌ 9 నోబాల్స్ వేశాడు.

ఘోర పరాజయం..

ఘోర పరాజయం..

420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 58.1 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (104 బంతుల్లో 72; 9 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (83 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ లీచ్‌కు 4 వికెట్లు దక్కగా, పేసర్‌ అండర్సన్‌ 3 కీలక వికెట్లు తీశాడు. చివరి రోజు తొలి సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌ ఇన్నింగ్స్‌ టీ విరామానికి ముందే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 'డబుల్‌ సెంచరీ' చేసిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. కాగా, చెన్నై వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, February 10, 2021, 14:10 [IST]
Other articles published on Feb 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+